)
GST Slabs Price Cut: జీఎస్టీ సంస్కరణలతో జరిగిన నష్టమేంది? దమ్ముంటే మీడియా ముందు చెప్పాలని బండి సంజయ్ సవాల్ చేశారు. ఇడ్లీ, దోశ, వడ అంటూ పనికిమాలిన మాటలు మాటలెందుకు అని అసహనం వ్యక్తం చేశారు. దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా దక్షిణాది వ్యక్తే కాదా? అని ప్రశ్నించారు. సమస్య ఉంటే ఆమె ద్రుష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు కదా? అని పేర్కొన్నారు. కొండా లక్మణ్ బాపూజీ తెలంగాణ స్ఫూర్తి అని బండి సంజయ్ తెలిపారు.
కరీంనగర్లో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన బండి సంజయ్ కీలక ప్రసంగం చేశారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు జరిగిన నష్టమేమిటో చెప్పకుండా ఇడ్లీ, దోశ, వడ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదంటూ తెలిపారు. నిర్మలా సీతారామన్ దక్షిణాది వ్యక్తేనని, నిజంగా జీఎస్టీ సంస్కరణలతో ఏదైనా సమస్య ఉంటే ఆమె దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.
నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు బాపూజీ అని బండి సంజయ్ కొనియాడారు. చేనేత, చేతివృత్తుల కార్మికుల కంచంలో అన్నం మెతుకుగా మారిన మానవతావాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలిపారు. తన జీవితమంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం అనే లక్ష్యాల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని వివరించారు.
'మనం చేసే మంచి మాత్రం నిత్య నూతనం. ఎప్పటికీ బతికి ఉంటది. పది మందికి స్పూర్తినిస్తది. ఆ స్పూర్తే మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ మహనీయుడు చేసిన త్యాగాలను, నిజాయితీని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతిని ఊరూవాడా అధికారికంగా జరుపుకునేలా కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది' అని బండి సంజయ్ గుర్తుచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ కలలు కన్న తెలంగాణ గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు.
'జీఎస్టీపై పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువచ్చాం. రేపటి నుంచి జీఎస్టీ కొనుగోలుదారులకు, విక్రయదారులను సన్మానిస్తాం. దురదృష్టమేమంటే ఇడ్లీ దోశ, వడ అంటూ, ఉత్తర దక్షిణ భారత్ అంటూ పనిలేనోళ్లు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌత్ వ్యక్తి. ఏమైనా ఇబ్బందులుంటే ఆమెతో మాట్లాడి సమస్య ఉంటే పరిష్కరించుకోవచ్చు' అని బండి సంజయ్ తెలిపారు. లేకుంటే నష్టం జరిగితే మీడియా ద్వారా ప్రజలకు చెప్పవచ్చని సూచించారు. అలా కాకుండా ఇడ్లీ దోశ వడ అంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? అట్లొండోళ్లకు ప్రజలే బుద్ది చెబుతారని బండి సంజయ్ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook