New Year 2026: కొత్త సంవత్సరం అందరికీ కొత్త ఆశలు, ఆశయాలు, లక్ష్యాలతో వస్తుంది. తమకు, తమ కుటుంబానికి ఆనందం, అభివ్రుద్ధి, శాంతి కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ సారి కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందుగా.. ప్రారంభమైన తర్వాత అయినా సరే కొన్ని శుభాచారాలను మీ దినచర్యలో భాగం చేసుకుంటే సానుకూల ఫలితాలను తప్పకుండా పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.
1. ఉదయం ఇలా ప్రారంభిస్తే రోజంతా శుభం:
ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఆరాధించే దేవుళ్లను ధ్యానించండి. మనస్సులో ఆ దేవున్ని ప్రార్థించండి. తర్వాత మీ చేతులను జోడించి ఈ మంత్రాన్ని పఠించండి.
“కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి,
కర్మూలే స్థితో బ్రహ్మా, ప్రభాతే కర్దర్శనం”
ఈ మంత్రాన్ని "కర్ దర్శన్ మంత్రం" అంటారు.
ఈ మంత్రాన్ని జపించడం వల్ల..
దేవతల అనుగ్రహం లభిస్తుంది
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది
రోజు సానుకూలంగా ప్రారంభమవుతుంది
మంత్రం పఠించిన తర్వాత మీ చేతులను మెల్లగా ముఖంపై మూడు నుంచి నాలుగు సార్లు రుద్దితే ఉదయం శక్తివంతంగా మొదలవుతుంది.
2. ఇంట్లో తప్పక చేయాల్సిన పనులు:
సాధారణంగా హిందువులలో ఇళ్లలో తప్పనిసరిగా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క ఉంటే శుభప్రదంగా ఉంటుంది. మీ ఇంట్లో తులసి మొక్క లేనట్లయితే కొత్త సంవత్సరానికి ముందుకు తీసుకువచ్చి నాటండి. ప్రతి రోజూ సాయంత్రం తులసి మొక్క వద్ద నెయ్యి దీపం వెలిగించండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా దీపం వెలిగించినట్లయితే నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఇంటి వాతావరణం పవిత్రంగా మారి ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ ఇలా చేసినట్లయితే కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
3. ఇంట్లోని ప్రతికూలతను తొలగించే సులభ మార్గాలు
మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని అనిపిస్తే కొన్ని సాధారణ పద్ధతులను పాటించి తగ్గించుకోవచ్చు. ఎలా అంటే
ఉప్పునీటితో శుభ్రపరచడం:
ప్రతి రోజు లేదా వారానికి కొన్ని రోజులు నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఇంటిని తుడవాలి. ఇది వాస్తు దోషాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కర్పూరం లేదా దూపం:
కర్పూరం వెలిగించి దాని పొగను ఇంట్లో ప్రతిమూలకు వెళ్లేలా చేయాలి. ఇది నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించే అత్యంత ప్రభావవంతమైన శాస్త్రీయ పద్ధతి.
సముద్రపు ఉప్పు :
ఇంటి మూలల్లో చిన్న పాత్రలో సముద్రపు ఉప్పు ఉంచండి. వారానికోసారి దానిని మార్చండి. ఇది ప్రతికూల శక్తిని భయటకు పంపించడంలో చాలా ఉపయోగపడుతుంది.
4. ప్రతి ఉదయం జపించాల్సిన శుభ మంత్రాలు
స్నానం చేసిన తరువాత ఈ మంత్రాలను జపిస్తే జీవితం మరింత శుభదాయకంగా మారుతుందని విశ్వాసం:
1. గాయత్రీ మంత్రం
“ఓం భూర్భువః స్వః తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్”
ధ్యానం, జ్ఞానం, శాంతి ప్రసాదించే శక్తివంతమైన మంత్రం.
2. విష్ణు మంత్రం
“ఓం నమో భగవతే వాసుదేవాయ”
మనస్సుకు శాంతి, ఇంటికి శుభం తీసుకొస్తుంది.
3. భూమి పూజ మంత్రం
“సముద్రవసానే దేవీ పర్వతస్థానమండితే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే”
ఈ మంత్రం జపించి భూమిని నమస్కరించడం వలన కర్తవ్యాలు విజయవంతంగా నడుస్తాయని చెబుతారు. ఇలా కొత్త సంవత్సర ప్రారంభంలో ఈ చిన్న మార్పులను దినచర్యలో చేర్చుకుంటే, జీవితంలో సానుకూలత, శాంతి, శ్రేయస్సు సహజంగానే పెరుగుతాయి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న నివారణలు, ప్రయోజనాలు, సలహాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. జీ తెలుగు వెబ్ పోర్టల్ ఈ ఫీచర్ వ్యాసం కంటెంట్ ను ఆమోదించడం లేదు. ఈ వ్యాసంలో ఉన్న సమాచారం ఇంటర్నెట్, జ్యోతిష్కులు, పంచాంగాలు, ఉపన్యాసాలు, నమ్మకాలు, మతగ్రంథాలు, ఇతి హాసాల నుంచి సేకరించింది. పాఠకులు ఈ కథనాన్ని అంతిమ సత్యంగా లేదా వాదనగా పరిగణించకూడదు. జీ తెలుగు వెబ్ పోర్టల్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









