Patanjalis Pivotal Role in International Yoga Day: యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు ఇది మనస్సును శాంతింపజేయడానికి ఒక మార్గంగా మారింది. . నేటి వేగవంతమైన, ఒత్తిడి జీవితంలో, ఇది సమతుల్యతను కోరుకునే వారికి ఒక శక్తివంతమైన సాధనంగా ఆవిర్భవించింది. ఒకప్పుడు సాంప్రదాయకంగా భావించిన ఈ అభ్యాసం ఇప్పుడు ఒక ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తోంది. ఈ మార్పునకు ముఖ్య కారణం బాబా రాందేవ్ , అతని సంస్థ అయిన పతంజలి. ఆయుర్వేద ఉత్పత్తులు, సహజ వైద్య విధానాలను ప్రోత్సహించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంటికి యోగాను చేర్చడంలో పతంజలి ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.
యోగా ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో పతంజలి పాత్ర చాలా ప్రత్యేకమైనది. బాబా రామ్దేవ్, పతంజలి సంస్థ ఆయుర్వేదం, స్వదేశీ ఉత్పత్తులు, సహజ చికిత్సలతో పాటు యోగాను ఇంటింటికీ చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. పతంజలి టీవీ ఛానెల్లు, దేశవ్యాప్త యోగా శిబిరాల ద్వారా యోగాను సామాన్య ప్రజలకు చేరువ చేసింది. సరళమైన భాషలో యోగా ప్రాముఖ్యతను వివరించడం, ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా లక్షలాది మందిని యోగా వైపు ఆకర్షించింది. పతంజలి యోగాను కేవలం పెద్దల కోసమే కాకుండా యువత కూడా ఆచరించేలా ప్రోత్సహించింది. పాఠశాలల్లో యోగాను ప్రవేశపెట్టడం, యువత కోసం ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవ చరిత్ర:
2014లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించిన సమయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆలోచన మొలకెత్తింది. శరీరం, మనస్సు, ఆత్మల కలయిక అయిన యోగా ఒక ప్రాచీన భారతీయ సంస్కృతి అని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరార్ధగోళంలో ఏడాదిలోకెల్లా అత్యంత పొడవైన రోజు జూన్ 21 అవ్వడం వల్ల, చాలా సంస్కృతుల్లో దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. ఐక్యరాజ్యసమితి ఈ ప్రతిపాదనను 2014 డిసెంబర్ 11న ఆమోదించింది, దీనికి 177 దేశాలు తమ మద్దతు తెలిపాయి. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న న్యూయార్క్, పారిస్, బీజింగ్ లాంటి ముఖ్య నగరాల్లో యోగా సంబంధిత కార్యక్రమాలతో జరుపుకున్నారు.
పతంజలి సహకారం:
పతంజలికి సారథ్యం వహిస్తున్న బాబా రామ్దేవ్, యోగాను సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ప్రత్యేకంగా ఆస్తా ఛానెల్లో ప్రసారమైన ఆయన యోగా కార్యక్రమాలు ప్రతి ఒక్కరి ఇంట్లో యోగాను సుపరిచితం చేశాయి. ఆయన యోగాను చాలా సులభంగా, అర్థమయ్యే పద్ధతిలో నేర్పించారు, దాంతో ఎవరైనా దానిని ఆచరించగలిగారు. అంతేకాకుండా, పతంజలి కేవలం భారతదేశంలోనే కాకుండా యునైటెడ్ స్టేట్స్ , యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో కూడా యోగా శిక్షణ శిబిరాలను నిర్వహించింది. ఈ శిబిరాలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పతంజలి కేవలం యోగాను బోధించడమే కాకుండా, తమ ఉత్పత్తులు ట్రస్టుల ద్వారా దానిని మరింతగా వ్యాప్తి చేసింది. వారి ఆయుర్వేద ఉత్పత్తులు యోగా, ఆరోగ్యం ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉన్నాయని ప్రజలు విశ్వసించేలా చేశాయి.
2015లో ఢిల్లీలోని రాజ్పథ్లో ఏకంగా 35,985 మంది కలిసి యోగా చేయడం ఒక అద్భుతం. ఈ ఉమ్మడి యోగా సాధన రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను నమోదు చేసింది. అత్యధిక సంఖ్యలో ప్రజలు ఒకేసారి యోగా చేసినందుకు ఒకే యోగా కార్యక్రమంలో 84 దేశాల ప్రతినిధులు పాల్గొన్నందుకు ఇది గుర్తింపు పొందింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం మొదలైనప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ పొందిందని, వేడుకగా జరుపుకుంటున్నారని ఈ ఘనత చాటి చెబుతోంది. పతంజలి సంస్థ యోగాకు ఎల్లప్పుడూ అందిస్తున్న మద్దతు చేస్తున్న ప్రచారం కారణంగానే ఇది నేడు ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకుంది. లక్షలాది మంది ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడానికి, తమ రోజువారీ జీవితంలో యోగా లాభాలను పొందడానికి ఇది స్ఫూర్తినిస్తోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









