Raju Gari Dongalu: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ‘రాజుగారి దొంగలు’.. ఈ నెల 21న విడుదల..

Raju Gari Dongalu: తెలుగులో ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో వైరెటీ కాన్సెప్ట్ చిత్రం ‘రాజు గారి దొంగలు’. ఇప్పటికే ఫస్ట్ లుక్, పోస్టర్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 16, 2025, 08:17 AM IST
Raju Gari Dongalu: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ‘రాజుగారి దొంగలు’.. ఈ నెల 21న విడుదల..

Raju Gari Dongalu:  లోహిత్ కల్యాణ్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, టీవీ రామన్, ఆర్కే నాయుడు లీడ్ రూల్స్ లో యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘రాజు గారి దొంగలు’. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో ఈ సినిమాను తెలుగు తెరపై ఇప్పటి వరకు రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో  రూపొందిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తై ఫస్ట్ కాపీ తో పాటు సెన్సార్ పూర్తి చేసుకొకి రెడీగా ఉంది. మొత్తంగా ఈ సినిమాను  మార్చి 21న ప్రపంచం వ్యాప్తంగా విడుదల చేయడానికి రెడీ అవుతోంది.  ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో మాట్లాడుతూ మంచి  వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోందన్నారు. ఈ నెల 21న ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండన్నారు. తెలుగు ప్రేక్షకులందరు ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ చిత్రానికి సందీప్ బదుల డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించారు. స్టోరీ రైటర్స్ – సుమంత్ పల్లాటి అందించారు. ఈ చిత్రానికి నాఫల్ రాజా ఏఐఎస్  మ్యూజిక్ అందించారు. రాజ వంశీ  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.  బ్యానర్ – హిటాసో ఫిలిం కంపెనీ, సమర్పణ – నడిమింటి లిఖిత, నిర్మాత – నడిమింటి బంగారునాయుడు, లోకేష్ రనాల్ హిటాసో డైరెక్ట్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News