Add Zee Business As A Preferred Source
App

Govt Employees: 8వ వేతన సంఘంతో ప్రభుత్వ ఉద్యోగులకు 'నాలుగింతలు' ఆనందం

Published: Sep 05, 2025, 05:42 PM IST|Updated: Sep 05, 2025, 05:42 PM IST

Govt Employees Likely To Increase Salary From Rs 1800 To Rs 51000: జీఎస్టీ స్లాబుల మార్పుతో ప్రజలకు శుభవార్త వినిపించిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కూడా 8వ వేతన సంఘంతో భారీ కానుక అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాల పెంపుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమలు కావాల్సిన వేతన సంఘం నుంచి కీలక విషయం లీకయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1/6

8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కమిషన్ ఏర్పాటును జనవరి 2025లో ప్రకటించినప్పటికీ ఇంకా చైర్మన్, కార్యవర్గాన్ని నియమించలేదు. దసరా పండుగకు 8వ వేతన సంఘం ఒక రూపుదాల్చుకుంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ కీలక అంశం లీకయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

2/6

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘ భారీ శుభవార్త చెప్పబోతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. వేతనాల పెరుగుదలపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

3/6

8వ వేతన సంఘం సిఫార్సులు 1వ తేదీన జనవరి 2026 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. కమిషన్ ఏర్పాటులో జాప్యం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. వేతన సంఘం సిఫార్సులు కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ప్రయోజనం చేకూరుస్తుంది. వేతన సంఘం ఏర్పడిన తర్వాత సిఫార్సులను అధ్యయనం చేసి అమలు చేయడానికి కనీసం ఒక సంవత్సరం పట్టవచ్చు. 8వ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి రావడానికి కనీసం 2026 చివరి వరకు లేదా 2027 ప్రారంభం వరకు సమయం పట్టే అవకాశం ఉంది.

4/6

8వ వేతన సంఘం ప్రకారం కనీస ఫిట్‌మెంట్ కారకాన్ని 2.86గా నిర్ణయించాలని ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి. దీని ఆధారంగా చూస్తే కనీస ప్రాథమిక వేతనం ప్రస్తుతం రూ.18,000 నుంచి రూ. 51,480కి పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) సర్దుబాటు చేస్తారు. 

5/6

7వ వేతన సంఘం కింద పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. జూలై 2025 నాటికి డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరిగే అవకాశం ఉంది. వీటిని సెప్టెంబర్‌లో అధికారికంగా ప్రకటించవచ్చు.

6/6

8వ వేతన సంఘంపై ఇప్పటివరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదు. దీంతో పూర్తి సమాచారం కోసం ఉద్యోగులు, పింఛన్‌దారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘంపై ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వేతన సంఘం సిఫార్సులు అమలైతే లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల జీవన ప్రమాణాలు మెరుగయ్యే అవకాశం ఉంది.