Add Zee Business As A Preferred Source
App

8th Pay Commission: వేతన సంఘంలో పింఛన్‌దారులకు భారీ కోత.. పింఛన్‌ సవరణకు బ్రేక్‌!

Published: Mar 31, 2025, 04:15 PM IST|Updated: Mar 31, 2025, 04:15 PM IST

8th Pay Commission Cut Off To Pension Before 1st Jan 2026: కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల మెడ మీద కత్తి వేటు వేసింది. 8వ  వేతన సవరణ సంఘం సిఫార్సులు కేవలం 1 జనవరి 2026 తరువాత ఉద్యోగ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తాయి. ఆ తేదీ ముందు వారికి 8వ వేతన సవరణ సంఘం సిఫార్సులు వర్తించవని ప్రకటించడంతో పింఛన్‌దారులకు భారీ షాక్‌ తగిలింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

8th Pay Commission Recommendations Of Pension1/5

8th Pay Commission Recommendations

8వ వేతన సంఘం సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం కారణంగా లక్షలాది పింఛనర్లకు భారీగా కోత పడనున్నట్టు సమాచారం. ఈ వార్తతో కేంద్ర ప్రభుత్వ పింఛన్‌దారులకు భారీ షాక్‌ తగలనుంది.

8th Pay Commission Pension Recommendations2/5

8th Pay Commission Recommendations Pension Cut

1 జనవరి 2026కు ముందు ఉద్యోగ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు లాంటి వార్త ఇది. 8 వేతన సవరణ సంఘం సిఫార్సులు వర్తిస్తాయని ఆశతో ఉన్న వారికి భారీ దెబ్బ తగలనుంది. 8వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం ప్రస్తుతం పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

8th Pay Commission Recommendations For Retired Employees3/5

8th Pay Commission Rtd Employees Recommendations

పెన్షనర్లకు ఇక పెన్షన్ సవరణ అనేది ఉండదని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో స్పష్టమవుతోంది. ఉద్యోగ విరమణ చేసినప్పుడు నిర్ణయించిన పింఛన్‌ మాత్రమే జీవించి ఉన్నంత కాలం తీసుకోవాలి. ఇది ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న చట్టంలోని అంశం.

8th Pay Commission Updates4/5

8th Pay Commission News

పింఛన్ సవరణకు సంబంధించిన బిల్లును ఇటీవల లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకోగా.. రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందితే చట్టం అవుతుంది. ఇక పింఛన్‌దారులకు నోటిలో మట్టి కొట్టినట్టు అవుతుంది.

8th Pay Commission Recommendations In Telugu5/5

8th Pay Commission News In Telugu

ఈ బిల్లుకు వ్యతిరేకంగా పింఛన్‌దారులు ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తమ నిరసనను పలు విధాల్లో తెలిపిన కేంద్ర ప్రభుత్వ పింఛన్‌దారులు ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే పింఛన్‌దారులు కార్యాచరణ ప్రకటించనున్నారు.