Actor vishal collapsed on stage: తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హీరో విశాల్ వచ్చారు. అయితే.. ఆయన స్టేజ్ మీద ఒక్కసారిగా కుప్పకూలీపోయారు. ఈ క్రమంలో ఆయనను వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఆలయచిత్తిరై ఉత్సవాలలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా హీరో విశాల్ హజరయ్యారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్జెండర్ల కోసం ‘మిస్ కూవాగం 2025’ అందాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు విశాల్ హజరైన నేపథ్యంలో అనుకొన ఘటన చోటు చేసుకుంది.
కార్యక్రమం జరుగుతుండగా వేదికపై ఉన్న విశాల్ ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయారు. దీంతో అక్కడున్న సిబ్బంది వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో హీరో విశాల్ పడిపోయాడనగానే ఆయన అభిమానులు ఏమైందో అని ఎమోషనల్ అయ్యారు.
ఈ క్రమంలో.. విశాల్ ఆరోగ్యంపై ఆయన పీఆర్ టీమ్ కీలక ప్రకటన చేశారు. " హీరో విశాల్ హెల్త్ బాగానే ఉందని చెప్పారు. అయితే.. ఆయన నిన్న మధ్యాహ్నం భోజనం చేయకపొవడం వల్ల ఒక్కసారిగా.. స్పృహ కోల్పోయారన్నారు
కేవలం జ్యూస్ తీసుకొవడం వల్ల వేదిక మీద కళ్లు తిరిగి పడిపోయాన్నారు. అంతకు మించి ఆయనకు ఏమి కాలేదని.. కొంతమంది ఆయనకు ఏవేవో జబ్బులు అంటకడుతున్నారని.. ఇవన్ని రూమర్స్ అంటూ కొట్టిపారేశారు.
విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్య బృందం నిర్ధారించిన విషయం వెల్లడించారు. ఇక మీదట ఆహారం తీసుకొవడంలో నెగ్లీజెన్సీగా ఉండొద్దని వైద్యులు చెప్పినట్లు పీఆర్ టీమ్ స్పష్టం చేశారు.