Add Zee Business As A Preferred Source
App

Aishwarya Rai: తనకు న్యాయం చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Written ByAruna Maharaju
Published: Sep 09, 2025, 04:14 PM IST|Updated: Sep 09, 2025, 10:43 PM IST

Actress Aishwarya Rai: ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. బాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్ బచ్చన్.. తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Aishwarya Rai  1/5

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలను ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా అశ్లీల ఫొటోలు క్రియేట్ చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని ఆమె హైకోర్టును కోరారు. 

Aishwarya Rai Moves Delhi High Court2/5

ఐశ్వర్య రాయ్

తన వ్యక్తిగత హక్కులను కాపాడుకోవడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఐశ్వర్య రాయ్ తెలిపారు. ఇక ఈ హీరోయిన్ తరపున సీనియర్ న్యాయవాది సందీప్ సేథీ కోర్టులో వాదించారు. ఐశ్వర్య రాయ్ పేరు, ఫోటోలను ఎవరైనా ఉపయోగించి డబ్బు సంపాదించడం లేదా అశ్లీల కంటెంట్ క్రియేట్ చేయడం చాలా తప్పన్నారు. 

Aishwarya Rai Moves Delhi High Court3/5

ఐశ్వర్య రాయ్

ఐశ్వర్య రాయ్ ఫోటోలు, వీడియోలను అనధికారికంగా ఉపయోగించకుండా నిరోధించడానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.   

Aishwarya Rai  4/5

ఐశ్వర్య రాయ్

ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 7న జాయింట్ రిజిస్ట్రార్ ముందు, ఆ తర్వాత జనవరి 15, 2026న కోర్టు ముందు జరుగనుంది.  

Aishwarya Rai Moves Delhi High Court5/5

ఐశ్వర్య రాయ్

ఇక ఐశ్వర్య రాయ్ చివరిసారిగా మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఆమె ఆ చిత్రంలోని రెండు భాగాలలోనూ నందిని మరియు ఉమై రాణి పాత్రలను పోషించింది.