Anasuya Interview టెలివిజన్ యాంకర్గా కెరీర్ను ప్రారంభించి, సినిమా పరిశ్రమలో.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ.. తాజాగా చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ రెండు అనసూయ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు
జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది అనసూయ. ఆ తర్వాత బుల్లితెరలోనే కాకుండా.. రంగస్థలం లాంటి సినిమాలతో వెండితెరపై కూడా తన సత్తా చాటింది.
ఈ క్రమంలో ఈ మధ్య అనసూయ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. "నాకు కూతురు కావాలి. ఇప్పటికైనా ప్రయత్నిస్తాను. కానీ నా భర్త సహకరించడం లేదు" అంటూ ఆమె చెప్పిన ఈ మాటలు చర్చనీయాంశంగా మారాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, “మాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మొదట కూతురు కావాలని అనుకున్నా, కొడుకే పుట్టాడు. రెండోసారి కూతురు కోసం ప్రయత్నించాను, అయినా కొడుకే పుట్టాడు. ఇప్పటికైనా నాకు కూతురు కావాలి. 40 ఏళ్ల వయసులో అయినా ప్రయత్నిస్తాను. కానీ భర్త సహకరించటం లేదు” అని చెప్పారు.
ఇక అనసూయ..ప్రేమ విషయానికి వస్తే, అనసూయ తన భర్త సుశాంక్తో ఎన్సీసీలో చేరిన సమయంలో పరిచయం ఏర్పడింది. హపెద్దలు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో, ఆమె సుశాంక్తో కలిసి ఇంటి నుండి బయటకి వెళ్లిపోయారు. అనంతరం తొమ్మిదేళ్లు వేచి చూసి పెద్దల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు.
ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – "మా పెద్దల సమ్మతితోనే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకున్నాను. సాయి బాబా ఆశీర్వాదంతో నా ప్రేమ విజయం సాధించింది" అని తెలిపారు. అంతేకాదు, 11 గురువారాలు వ్రతాలు ఆచరించి, చాక్లెట్, ఆలుగడ్డల వంటకాల్ని 7 ఏళ్లు తినకుండా త్యాగం చేసిన విషయాన్ని కూడా చెప్పారు.