Add Zee Business As A Preferred Source
App

AP Weather Update: ఏపీకి వాయుగుండం ముప్పు.. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ

Written ByAruna Maharaju
Published: Sep 23, 2025, 03:21 PM IST|Updated: Sep 23, 2025, 04:50 PM IST

AP Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య హెచ్చరిక.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మరి కొన్ని గంటల్లో పిడుగులు పడనున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.

red alert in ap1/5

జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ

ఏపీలోని వాతావరణ శాఖ పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలెర్ట్ జారీ చేశారు.   

Rains in Ap2/5

పిడుగులతో కూడిన వర్షాలు

శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో.. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడవచ్చని ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చారు.   

ap rains3/5

ఏపీలో వర్షాలు

తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.   

ap rains alert4/5

ఏపీకి వాయుగుండం

అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.  

Ap weather update5/5

ఏపీలో భారీ వర్షాలు

 భారీ ఈదురు గాలుల దృష్ట్యా వేటకు వెళ్లే మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.