Bank Holiday: రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా?

3 Days Bank Holidays: దేశవ్యాప్తంగా బ్యాంకులు మూడు రోజులపాటు బంద్‌ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఏవైనా బ్యాంకు పనులు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోండి. వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో బ్యాంకు పనులు నిలిచిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు కూడా బ్యాంకులకు సెలవు ఉంది. అయితే వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్‌ ఎందుకు ఉంటాయో ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /7

సాధారణంగా మనదేశంలో బ్యాంకులకు ఆర్‌బీఐ జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం ఉంటాయి. ఇది కాకుండా కొన్ని స్థానిక పండుగల ఆధారంగా కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్ ఉన్నాయి.  

2 /7

ఏప్రిల్‌ 30వ తేదీ అక్షయ తృతీయ సందర్భంగా బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఇక ఆరోజు బసవ జయంతి కూడా ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇది స్థానిక పండుగ గా జరుపుకొనున్నారు.  

3 /7

ఇక మే 1వ తారీకు మే డే అంటే 'లేబర్ డే' సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు బంద్‌ ఉంటాయి. ఆరోజు కార్మికులకు దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు.  

4 /7

ఇక ఇది మాత్రమే కాదు మే 3వ తేదీ మొదటి శనివారం ఈరోజు బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయి. అందులో ఎలాంటి మార్పు లేదు. కానీ మే 4వ తేదీ ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు బంద్ ఉంది.  

5 /7

అయితే బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉన్నా కానీ ఆన్‌లైన్ సేవలు కొనసాగుతాయి. క్యాష్‌ డిపాజిట్ విత్ డ్రా మాత్రం జరగదు. అంతే కాదు డిడిలు వంటిది నిలిచిపోయే అవకాశం ఉంది. కేవలం ఏటీఎం సేవలు, డిజిటల్ బ్యాంకింగ్ మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.  

6 /7

అత్యవసర పరిస్థితుల్లో ముందుగానే డబ్బులు విత్ డ్రా చేసి పెట్టుకోవాలి. మీ మొబైల్ వాలెట్లో అవసరమైన డబ్బు ఉందా లేదా చెక్ చేసుకోండి. దీనికి ముందుగానే ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకుంటే మంచిది. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ తో మీ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించవచ్చు.  

7 /7

బ్యాంకు బ్రాంచీలు బంద్‌ ఉంటాయి. కాబట్టి ఆన్‌లైన్‌ చెల్లింపులు ఎక్కువ అవుతాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో హెవీ ట్రాఫిక్ అవుతుంది. యూపీఐ పేమెంట్స్ ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఏప్రిల్‌ 29 కూడా బ్యాంకులు పరశురామ జయంతి సందర్భంగా బంద్‌ ఉండనున్నాయి.