Delhi Blast : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ స్థలంలో నిలిచి ఉంచిన ఓ కారులో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్ఎన్ జేపీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనాస్థలానికి సంబంధించిన ఫొటోలను చూస్తుంటే మనస్సు కలచివేస్తోంది.
ఎర్రకోట వద్ద కారు పేలుడు తర్వాత, మొత్తం ఢిల్లీ అంతటా హై అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.
ఎర్రకోట వద్ద కారు పేలుడు తర్వాత, మొత్తం ఢిల్లీ అంతటా హై అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.
ఎర్రకోట వద్ద కారు పేలుడు తర్వాత, మొత్తం ఢిల్లీ అంతటా హై అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.
ఎర్రకోట వద్ద కారు పేలుడు తర్వాత, మొత్తం ఢిల్లీ అంతటా హై అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.
ఎర్రకోట వద్ద కారు పేలుడు తర్వాత, మొత్తం ఢిల్లీ అంతటా హై అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.
ఎర్రకోట వద్ద కారు పేలుడు తర్వాత, మొత్తం ఢిల్లీ అంతటా హై అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.
ఈ పేలుడులో అనేక కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కార్లలో ఉన్న వ్యక్తులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. NIA బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (LNJP) ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి చేరుకునేలోపే ఎనిమిది మంది మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి నిలకడగా ఉంది అని అన్నారు.
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు తర్వాత, రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పేలుళ్లలో గాయపడిన వారిని ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్జెపి) ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు ఈ పేలుళ్లలో 24 మంది గాయపడ్డారు.
ఢిల్లీ పేలుడు తర్వాత, జైపూర్లో ఇప్పుడు అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ అలర్ట్లో అన్ని అధికారులు రంగంలోకి దిగి, నిఘాను ముమ్మరం చేయాలని, కమ్యూనికేషన్ను కొనసాగించాలని కోరారు.