Railway Diwali Bonus Eligibilty: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 74 రోజుల ప్రోడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) ప్రకటిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రూ.1866 కోట్లు రైల్వే ఉద్యోగులకు బోనస్గా కేటాయించనున్నారు. దీంతో 10.90 లక్షల ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అయితే ఈ బోనస్కు ఎవరు అర్హులు? ఎప్పుడు వారి ఖాతాలో జమ కానున్నాయి తెలుసుకుందాం.
1/5ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 78 రోజుల బోనస్ రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించారు. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కొన్ని కోట్లు రైల్వే ఉద్యోగులకు లబ్ధి పొందనున్నారు. దీపావళికి ముందే వారికి ఈ బోనస్ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది.
2/5ప్రధానంగా రైల్వే ఉద్యోగులైన ట్రాక్ మెయిన్టైనెర్స్, లోకో పైలట్, ట్రాక్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, టెక్నీషియన్స్, హెల్పర్స్, పాయింట్స్ మాన్, రైల్వే మినిస్ట్రీ ఎంప్లాయిస్తోపాటు ఇతర గ్రూపులకు చెందిన ఉద్యోగులు కూడా ఈ బోనస్ లబ్ధి పొందనున్నారు.
3/5అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగులు మాత్రం ఈ బోనస్ పరిధిలోకి రారు. ప్రతి ఏడాది దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇది. గత ఎడాది మోదీ ప్రభుత్వం రూ.2,029 కోట్లు బోనస్ కోసం విడుదల చేశారు.
4/5అయితే అధికారిక సమాచారం మేరకు బెంగాల్, బీహార్ కి చెందిన రైల్వే ఉద్యోగులు దసరాకి ముందుగానే ఈ బోనస్ పొందనున్నారు. ఉత్తర భారత ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు దీపావళి ముందుగా ఈ బోనస్ అందుకోనున్నారు. అయితే, రైల్వే ఉద్యుగులు గరిష్టంగా రూ.17951 బోనస్ పొందనున్నారు.
5/5దసరా, దీపావళి, ఛత్పూజ్ సందర్భంగా అందరూ పూజలు, షాపింగ్లు చేసుకునే సమయం. బోనస్ విడుదల అవ్వడంతో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ధరలు తగ్గించడంతో నిత్యవసర వస్తువులు ఇతర కొన్ని లగ్జరీ వస్తువులు కూడా ధరలు తగ్గాయి.