Add Zee Business As A Preferred Source
App

Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌.. డీఏ పెంపు ఉత్తర్వులు జారీ!

Published: Oct 20, 2025, 01:33 PM IST|Updated: Oct 20, 2025, 07:41 PM IST

Diwali Bumper Jackpot To AP Govt Employees DA Hike: దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుకగా ప్రకటించారు. 3.64 శాతం డీఏ, డీఆర్‌ పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా డీఏ, డీఆర్‌ పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1/6

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్లకు  దీపావళి కానుకగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ప్రకటించిన డీఆర్‌, డీఏ పెంపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.

2/6

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, రిటైర్డ్‌ ఉద్యోగులకు డీఆర్‌ మంజూరు చేస్తూ  ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

3/6

2024 జనవరి 1 నుంచి డీఏను 3.64 శాతం పెంచుతూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. డీఎ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.

4/6

పెన్షనర్లు/ కుటుంబ పెన్షనర్లకు చెల్లించాల్సిన డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్‌) 3.64 శాతం ప్రభుత్వం పెంచగా.. డీఆర్‌ కూడా 2024 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది.

5/6

డీఏ, డీఆర్‌ పెంపునకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని  ఏపీ సీఎఫ్ ఎంఎస్  సీఈవోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ  ముఖ్య కార్యదర్శి  పీయూష్ కుమార్  ఆదేశాలు జారీ చేశారు.

6/6

నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండగా ఏపీ ప్రభుత్వం దీపావళి రోజు ఒక డీఏ ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. రెండు డీఏల విడుదలపై ఆశలు పెట్టుకోగా ఒకటే రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తి చెందలేదు.