EPS Pension Update News: దేశంలోని లక్షలాది మంది ఉద్యోగులకు అవసరాల మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక మార్పులను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో వస్తున్న ఈపీఎస్ కనీస పెన్షన్ మొత్తాన్ని సవరించాలని పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి అప్డేట్ వచ్చింది.
దేశంలో లక్షలాది పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చేందుకు మోదీ సర్కార్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈపీఎస్ పెన్షన్ను సవరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సమాచారం.
ఈపీఎస్ విధానంలో ప్రతి ఉద్యోగికి ఇవ్వనున్న కనీస పెన్షన్ మొత్తాన్ని సవరించాలంటూ పెన్షనర్లు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
కనీస పెన్షన్ను రాబోయే నెలల్లో పెంచే అవకాశం కనిపిస్తుంది. అంతకుముందు 2020లో కార్మిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ మద్దతుతో నెలకు 2,000 రూపాయలను కనీస పెన్షన్ను అందించాలని సన్నాహాలు జరిగాయి. కానీ, ఆ ప్రణాళికలను ఆర్థిక మంత్రిత్వ శాక ఆమోదించలేదు.
EPS పెన్షనర్ల ప్రతినిధి బృందంలో కొందరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను నెలకు రూ.7,500 కనీస పెన్షన్ అందించాలని కోరారు.
ద్రవ్యోల్బణం, పార్లమెంటరీ ఆందోళనలు, దేశంలో ఆర్థిక ప్రభావం కారణంగా కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత కనీస పెన్షన్ను రూ.3,000కి పెంచడాన్ని తీవ్రంగా పరిగణించింది.
చివరిగా.. ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఆర్థిక ప్రభావం కారణంగా కనీస EPS పెన్షన్ను రూ. 3,000 కు సవరించాలనే ప్రతిపాదిత వచ్చింది. బడ్జెట్ పరిమితులు, విధానపరమైన పరిగణనలు దాని అమలు సమయం, పరిధిని ప్రభావితం చేయవచ్చు.