Gold Price Today In Delhi: దేశ రాజధానిలో బంగారం ధరలు

  • Apr 22, 2021, 08:57 AM IST
1 /4

Gold Rate Update 22 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు రూ.300 పెరగగా, ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధరలు రూ.200 మేర స్వల్పంగా పెరిగాయి.  Also Read; Pink Whatsapp: పింక్ వాట్సాప్ లింక్ క్లిక్ చేయవద్దు, మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది తెలుసా

2 /4

Gold Price In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. తాజాగా రూ.770 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,930కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,850 అయింది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా బంగారం ధర రూ.290 మేర పుంజుకుంది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,810కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,590 అయింది. Also Read: Night Duty Allowance: నైట్ డ్యూటీ అలవెన్స్‌ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు మరోసారి పెరిగాయి. ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.200 మేర పెరిగింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.68,800 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి రూ.300 మేర తగ్గడంతో 1 కేజీ ధర రూ.73,900కి చేరింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook