Gold Mine In India: బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నవేళ.. దేశంలో మరో కొత్త బంగారు గని బయటపడింది. భారత్లో బంగారు గనులు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు.. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. అయితే ఇప్పుడు కర్ణాటకని అధిగమించి.. రాజస్థాన్ రాష్ట్రం పేరు మారుమ్రోగుతోంది. ఇప్పటికే రాజస్థాన్లో రెండు బంగారు గనులు ఉండగా.. తాజాగా మరో బంగారు గనిని గుర్తించారు.
1/5రాజస్థాన్లోని బాన్స్వాడ జిల్లాలో మూడవ బంగారు గనిని భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గనిలో 3 చ.కి.మీ విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిల్వలు ఉన్నాయన్నారు. తాజాగా కనుగొనబడిన ఈ గనితో భారతదేశంలో బంగారం ఉత్పత్తిలో.. రాజస్థాన్ వాటా మరో 25 శాతంకు పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2/5రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పటికే రెండు గనులు ఉన్నాయి. ఇక తాజాగా బాన్స్వాడ జిల్లాలోని ఘటోల్-కంకారియా గ్రామంలో.. మూడవ బంగారు గనిని భూగర్బ శాస్త్రవేత్తలు గుర్తించారు. మైనింగ్ లైసెన్స్ జారీ అయిన వెంటనే.. ఖనిజం వెలికితీత పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నారు.
3/5అయితే 940.26 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మొత్తం ప్రాంతంలో.. 113.52 మిలియన్ టన్నులు బంగారు ఖనిజం ఉండవచ్చని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
4/5ఈ ఖనిజంను ప్రాసెస్ చేస్తే మొత్తం 222.39 టన్నుల బంగారు లోహం లభించవచ్చని.. కంకారియా-గారా ప్రాంతంలో 205 హెక్టార్లలో 1.24 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
5/5ఈ గనిలో గోల్డ్తో పాటు అనేక ఇతర సహ ఖనిజాలు కూడా వెలికితీసేందుకు.. శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా కనుగొనబడిన ఈ గనితో దేశంలో బంగారం ఉత్పత్తిలో రాజస్థాన్ వాటా మరో 25 శాతంకు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు.