Add Zee Business As A Preferred Source
App

Cyber Crime Alert: న్యూడ్ ఫొటోలు పంపాలంటూ బాలీవుడ్ స్టార్ హీరో కూతురికి వేధింపులు.. ఏం జరిగిందంటే..?

Written ByAruna Maharaju
Published: Oct 03, 2025, 04:35 PM IST|Updated: Oct 03, 2025, 04:35 PM IST

Akshay Kumar Shares Shocking News: సైబర్ నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిన్న అవకాశం వచ్చినా నేరస్థులు ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరికైనా ఈ ముప్పు తప్పడం లేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. తన కూతురికి సైబర్ నేరగాళ్ల వల్ల జరిగిన భయంకరమైన ఓ ఇన్సిడెంట్‌ను పంచుకున్నారు. 
 

అక్షయ్ కుమార్ కూతురు నితార1/5

అక్షయ్ కుమార్ కూతురు నితార

ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరస్థులు ఏ చిన్న అవకాశం వచ్చినా.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ.. ప్రతి ఒక్కరిని అల్లాడిస్తున్నారు. తాజాగా ముంబైలో డీజీపీ కార్యాలయంలో అక్టోబర్ 2025 సైబర్ అవేర్‌నెస్ మంత్ ప్రారంభం సందర్భంగా.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. అక్కడ తన కుటుంబానికి సైబర్ నేరస్థులు చేసిన భయంకర అనుభవాన్ని పంచుకున్నారు.  

Akshay Kumar Daughter Nithara2/5

న్యూడ్ ఫొటోలు పంపాలంటూ అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు

అక్షయ్ కుమార్ కూతురు 13 ఏళ్ల నితారా.. ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా ఒక అపరిచితుడు ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట ఆ వ్యక్తి మంచి మాటలు చెప్పి స్నేహం చేయాలని ప్రయత్నించాడు. కొంతసేపటికి అమ్మాయివా, అబ్బాయినా అని అడిగాడు. నితారా అమ్మాయినని చెప్పగానే అతని మాటలు మారిపోయి చెడ్డగా మారాయి. వెంటనే తన న్యూడ్ ఫొటోలు పంపమని అడిగాడు. 

Akshay Kumar Daughter Targeted3/5

అక్షయ్ కుమార్ కూతురు నితార

అతను అలా అడగ్గానే తన కూతురు నితారా భయపడి గేమ్ ఆపేసి.. తల్లి ట్వింకిల్ ఖన్నాకు చెప్పిందని.. ఇది చాలా మంచి నిర్ణయమని అక్షయ్ కుమార్ అన్నారు. పేరెంట్స్‌కి ఏం జరిగిన పిల్లలు వెంటనే చెప్పాలని.. లేదంటే కఠిన పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు.   

Akshay Kumar Daughter Nithara4/5

అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు

ఈ ఘటన తన కుటుంబానికి మాత్రమే కాదు దేశంలోని ప్రతి పిల్లలకు, తల్లిదండ్రులకు హెచ్చరిక అని అక్షయ్ కుమార్ చెప్పారు. నేరస్థులు మొదట మంచిమాటలతో నమ్మకం పెంచుకుని తర్వాత పిల్లలను లైంగికంగా వేధించాలని ప్రయత్నిస్తారు. ఇది బ్లాక్‌మెయిల్‌ వరకు వెళ్లి.. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు కూడా దారితీస్తుందన్నారు.   

Akshay Kumar Shares Shocking News5/5

అక్షయ్ కుమార్ బాలీవుడ్ హీరో

చట్టాలతో మాత్రమే ఈ నేరాలను ఆపలేమని.. ప్రతి ఒక్కరూ డిజిటల్ ప్రపంచంలో అవగాహన పెంచుకొని.. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అక్షయ్ కుమార్ తెలిపారు. పాఠశాలల్లో చరిత్ర భూగోళం లాంటి విషయాలతో పాటు సైబర్ నేరాలపై తప్పనిసరి తరగతులు ఏర్పాటు చేయాలని సీఎం ఫడ్నవీస్‌ను అక్షయ్ కుమార్ కోరారు. సైబర్ ప్రపంచంలో చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు.