India Railways: మారిన తత్కాల్ టికెట్ నియమాలు.. . భారతీయ రైల్వేలు ముఖ్యమైన ప్రకటన..

India Railway Rules Changed: రైల్వే తత్కాల్ టికెట్ నియమాలు మారాయి. భారతీయ రైల్వే ముఖ్యమైన ప్రకటన చేసింది. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే వెన్నుముక లాంటిది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేస్తారు. అయితే రైల్వే తీసుకువచ్చిన కొత్త ముఖ్యమైన మార్పులు ఏంటో తెలుసుకుందాం..
 

1 /6

భారత రైల్వేలో మే 1వ తేదీ నుంచి కీలక మార్పులు జరగనున్నాయి. మన దేశంలో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైల్వే ద్వారా ప్రయాణం చేస్తారు. అతి తక్కువ ధరలోనే టికెట్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు సులభ ప్రయాణం వల్ల గమ్య స్థానాన్ని కూడా త్వరగా చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది రైల్వే ప్రయాణం చేస్తారు.  

2 /6

అయితే రైల్వే గతంలో రిజర్వేషన్ 120 రోజులు ముందు చేసుకునే సదుపాయం ఉండేది. ఇప్పుడు కేవలం 60 రోజులకు తగ్గించబడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కేవలం 60 రోజుల ముందుగా మాత్రమే రైల్వే బుక్ చేసుకోవాలి.  

3 /6

ఇది మాత్రమే కాదు వెయిటింగ్ టికెట్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లలో వెయిటింగ్ టికెట్లు ఉండవు. కేవలం పబ్లిక్ కంపార్ట్‌మెంట్లో మాత్రమే ఈ వెయిటింగ్ టికెట్స్‌ అందుబాటులో ఉంటాయి. వెయిటింగ్ టికెట్ తో ప్రయాణిస్తే మాత్రం భారీ జరిమానా విధించనున్నారు.  

4 /6

అంతేకాదు ఇక్కడ తత్కాల్ టికెట్ బుకింగ్ ఏసీ తరగతికి ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ చేసుకుని సదుపాయం ఉంది. ఇక నాన్ ఏసీకి సంబంధించిన కోచ్‌లలో తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.   

5 /6

ఇక రైల్వే ప్రయాణం చేసేటప్పుడు రిజర్వేషన్ చేసుకోకుండానే ఆహారం కొనుగోలు చేసే సదుపాయం కూడా కల్పించారు. ప్రయాణ సమయంలో మెనూ కార్డులు, ఛార్జీలు  వంటివి అందుబాటులో ఉంటాయి. ఆ సమయంలో ప్రయాణికులు కొనుగోలు చేయవచ్చు.  

6 /6

అంతేకాదు రైల్వే టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో ఎలాంటి గుర్తింపు కార్డు నమోదు చేసే అవసరం లేదు. కేవలం ప్రయాణ సమయంలోనే గుర్తింపు కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. ఇక రైల్వే చార్జీలను కూడా మే 1వ తేదీ నుంచి పెరగనున్నాయి. ప్రధానంగా రైల్వే రిజర్వేషన్స్, సూపర్ ఫాస్ట్, తత్కాల్ ఛార్జీలను మే 1వ తేదీ నుంచి ధరలు పెరుగుతాయి.