Droupadi Murmu: రాష్ట్రపతిని కలిసిన భారత మహిళా క్రికెటర్లు.. విశ్వ‌విజేత‌ల‌పై ద్రౌపది ముర్ము ప్రశంసలు..!

Team India: మొదటిసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను సాధించిన భార‌త మ‌హిళా క్రికెట్ జట్టు గురువారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిశారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తికి భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్లు సంత‌కం చేసిన జెర్సీని అందించారు. అలాగే ప్రపంచ కప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేశారు.

1 /5

వరల్డ్ కప్ సాధించిన టీమిండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్‌.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టును  రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అభినందించారు. 

2 /5

ప్రపంచకప్ సాధించి చరిత్ర సృష్టించారని, యువతరానికి ఆదర్శంగా నిలిచారంటూ వారిని.. రాష్ట్రపతి ప్ర‌శంసించారు.   

3 /5

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపు సరదాగా మహిళా క్రికెటర్లతో గడిపారు. అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇలానే అన్నింటిలో విజయాలు సాధించాలని ద్రౌపది ముర్ము ఆకాక్షించారు.

4 /5

న‌వంబ‌ర్ 2న నవీ ముంబై వేదిక‌గా భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి.   

5 /5

ఈ మ్యాచ్‌లో 52 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికాను భార‌త్ ఓడించింది. తద్వారా తొలిసారి మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్ ముద్దాడింది.