L2Empuraan: మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లూసీఫర్’ . ఇపుడీ మూవీకి ప్రీక్వెల్ గా ‘ఎంపురాన్’ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో మోహన్ లాల్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
L2Empuraan:పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన దిల్ రాజు కి ధన్యవాదలు. తెలుగులో మా సినిమాను విడుదల చేస్తున్న ఆయనకు కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాను మేం ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒరిజినల్ వర్షెన్లానే తెలుగు వర్షెన్ ఉంటుందన్నారు.
తెలుగు డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డామన్నారు. చాలా నాచురల్ గా ఉండాలని ప్రయత్నించామన్నారు. తెలుగు ప్రేక్షకులు తెలుగు వర్షెన్లో చూస్తే.. ఒరిజినల్ సినిమానే అనుకుంటారు.ఎక్కడా డబ్బింగ్ సినిమా అన్నట్టుగా కనిపించదు.
లూసిఫర్ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయలేదు. కానీ అన్ని భాషల్లోకి ఆ చిత్రం ప్రేక్షకులకు చేరువైంది. అందుకే ఇప్పుడు ఈ రెండో పార్ట్ను ప్రపంచ వ్యాప్తంగా అన్నిప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నామన్నారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే అన్నీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఈ రేంజ్ ట్రెండ్ చూసి మేమంతా ఆశ్యర్యానికి గురువతున్నాము.
నా దృష్టిలో మంచి సినిమా చెడ్డ సినిమా అనేది మాత్రమే ఉంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదన్నారు. నేను మంచి సినిమాను తీశానని నమ్ముతున్నాను. కాకపోతే ఆ సినిమాను హై బడ్జెట్లో తెరకెక్కించాను. ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఏ ఒక్కరూ కూడా ఎంత బడ్జెట్ అయి ఉంటందో అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరన్నారు.
అలా ఎంత అంచనా వేసినా సరే దానికంటే ఎక్కువగానే ఉంటుందన్నారు. మోహన్లాల్ ఇచ్చిన సపోర్ట్, ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ వల్లే ఈ చిత్రాన్ని ఇంత గ్రాండియర్గా, ఇంత హై బడ్జెట్లో తీయగలిగామన్నారు. ఈ క్రెడిట్ అంతా ఆయనదే అన్నారు.
ఎంపురాన్ మూవీ కోసం మోహన్లాల్ గారు, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశాం. మార్చి 27న మా చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారన్నారు. మూడో పార్ట్ చేసేలా సపోర్ట్ చేయండన్నారు.