Add Zee Business As A Preferred Source
App

Pitru Paksha 2025: పితృ దోషాల వలన కలిగే నష్టాలేమిటి.. ? చేయవలసిన కర్మలు ఇవే..

Written ByTA Kiran Kumar
Published: Sep 07, 2025, 08:25 AM IST|Updated: Sep 07, 2025, 08:31 AM IST

Mahalaya Paksham 2025: హిందూ సనాతన సంప్రదాయంలో కొన్ని దోషాలుంటాయి. అందులో పితృ దోషం ఒకటి. మన కన్న తల్లిదండ్రులకు కానీ.. పిల్లకు కానీ ఎవరికైనా తెలిసో.. తెలియకో.. కష్టాలు కలిగిస్తుంటాము. అంతేకాదు మన పూర్వీకులు ఎవరో తెలిసో తెలియకో చేసిన పాపాలు.. వారి వారసులను పట్టి పీడుస్తుంటాయి. వాటినే పితృదోషాలుగా పిలుస్తాము. 

Pitru Doshalu 1/5

పితృదోషాలు

Mahalaya Paksham 2025: పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఏ ఋణమైనా తీరవచ్చు కానీ.. మాత, పితరుల ఋణం తీర్చుకోలేనిది. ఇక  పితృ ఋణం నుండి ముక్తి పొందటం అంత ఈజీ కాదు. 

shraddha kaalam 2/5

శ్రాద్ధకాలం

తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టలేనది. పితృ గణాల శ్రాద్ధ కర్మ చేయటం సంతానం ఒక్క విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో పాటు వాయురూపంలో భోజనం స్వీకరిస్తారనేది శాస్త్ర వచనం.

Punya thithi 3/5

పితరుల పుణ్య తిథి

సూర్యుడు కన్యరాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారట. శ్రాద్ధం అంటే మనం శ్రద్ధతో చేసేదనేది శ్రాద్ధం. హిందూ కాలండర్ ప్రకారం ప్రతి నెలలో  అమావాస్య , పితరుల పుణ్య తిథిగా చెప్పబడింది. అందులో మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంది.  

Shraddha karma 4/5

శ్రాద్ద కర్మ

ఆ సమయంలో శ్రాద్ద కర్మ ను శ్రద్దగా  ఆదర పూర్వకంగా ఆచరిస్తే.. తమ సంతానంతో పాటు వారి సంతతి వారు ఆయువు, ఆరోగ్యం, విద్య , ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారట. 

Anna danam 5/5

అన్నదానం

అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కాని ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంత కోటి యజ్ఞ ఫలితం ఇస్తుందనేది మన పురాణ గ్రంథాల్లో ఉంది.  అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలాన్నిస్తుందనేది ప్రతీతి.