Add Zee Business As A Preferred Source
App

Cyclone Photos: మొంథా ఎఫెక్ట్‌.. కూలిన చెట్లు, ఉధృతంగా మారిన నదులు..!

Written ByRenuka Godugu
Published: Oct 29, 2025, 09:19 AM IST|Updated: Oct 29, 2025, 09:19 AM IST

Montha Cyclone Photos: తీరం దాటిన మొంథా తుఫాను ధాటికి నదులు, చెరువులు ఉధృతంగా మారాయి. చెట్లు, కరెంట్‌ స్తంభాలు కూడా రహదారులపై కుప్పకూలిపోయాయి. అర్ధరాత్రి 12:30 సమయంలో మొంథా తుఫాను తీరం దాటింది. అయితే ధ్వంసమైన చెట్లు ఉధృతంగా మారిన నదుల ఫోటోలు చూద్దాం. 
 

AP1/8

ఏపీ

మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్ వల్ల ఏపీలోని పలు ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలిపోయాయి. పలు కార్లు, బైకులు కూడా ధ్వంసం అయ్యాయి. భూభాగంపై బలహీన పడిన మొంథా తుఫాన్‌ వల్ల 24 గంటల పాటు ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి.  

Cyclone Effect2/8

తుఫాన్‌ ధాటికి

తుఫాన్‌ ధాటికి గంటకు 95 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. కోస్తా ఆంధ్రతోపాటు తెలంగాణలో జిల్లాలకు కూడా రెడ్‌ అలర్ట్ జారీ చేశారు.  

Srikakulam3/8

శ్రీకాకుళం

మొంథా ఎఫెక్ట్ శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, కోనసీమ, తూగో, పగో జిల్లాలో భారీ వర్షాలు కురువనున్నాయి. కోనసీమ, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలకు కురుస్తున్నాయి.   

Prakasham4/8

ప్రకాశం జిల్లా

ఇక ప్రకాశం జిల్లాలో ఎస్సీ పాలెం లో భారీ వేపచెట్టు కూడా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణం లేదు. దీంతోపాటు జాతీయ రహదారిపై కూడా విద్యుత్ స్తంభాలు అల్లూరు జిల్లాలో పడిపోయాయి.  

NallaVagu5/8

నల్లవాగు

ఐటీడీఏ పెట్రోల్ బంకు సమీపంలో కూడా పలు వృక్షాలు కుప్పకూలిపోయాయి. ఎర్రబాలెంలో నల్లవాగు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రహదారి మధ్యలో కూడా పలు నదులు ఉధృతంగా మారి పొంగి పొర్లుతున్నాయి.  

Cyclone Photos6/8

తుఫాన్ ఫోటోలు

కొన్ని ప్రాంతాల్లో చెట్లు, కార్లు, బైకులు, విద్యుత్ స్తంభాలపై భారీ వృక్షాలు కుప్పకూలి పడిపోయాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రాణ నష్టం వాటిల్ల లేదు కానీ కృష్ణ జిల్లాలో విద్యుత్ స్తంభాలపై చెట్లు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.  

Montha Cyclone7/8

మొంథా తుఫాన్‌

అర్ధరాత్రి రహదారిపై కుప్పకూలిన భారీ వృక్షాలను సిబ్బంది ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టి తొలగించారు. విరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలను పక్కకు తొలగిస్తున్నారు. చాలామంది ప్రజలను పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు.  

Montha8/8

మొంథా

ఈ మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్ వల్ల భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా నేలమట్టం అయ్యాయి. నదులు కూడా ఈ తుఫాను ధాటికి పొంగి ప్రవహిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను అలెర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.