Nayanthara 22 years of journey: నయనతార.. ఈ అందాల తార గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రముఖి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తరువాత బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే నయనతార తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయగా.. అది ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
1/5లేడీ సూపర్ స్టార్ నయనతార.. తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అదేంటంటే నయనతార.. సినీ ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది నయన్.
2/5మొదటిసారి కెమెరా ముందు వచ్చి నేటికి 22 ఏళ్లు. సినిమాలే నా ప్రపంచం అవుతాయని ఎప్పుడు అనుకోలేదు. తెలియకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం నన్ను మార్చేశాయి, ధైర్యాన్నిచ్చాయి. నన్ను నన్నుగా మార్చాయి.
3/5నా ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానంటూ పోస్ట్ రిలీజ్ చేసింది. దీంతో నయనతార షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
4/5ఇక ఈ పోస్ట్ చూసిన సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు, ఫ్యాన్స్.. నయనతారకు కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
5/5ఇక నయనతార ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తోంది. మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు.