Parijata yog effect: చాలా ఏళ్ల తర్వాత శక్తివంతమైన పారిజాతయోగం ఏర్పడనుంది.ఈ క్రమంలో పండితులు కొన్నిరాశుల వారికి అనుకొని విధంగా ధనలాభం కల్గుతుందని, జీవితంలో పెనుమార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు.
జ్యోతిష్య పండితులు ప్రకారం జీవితంలో కొన్ని యోగాలు ఒక్కసారిగా భారీగా మార్పులు తీసుకుని వస్తాయి. దీని ప్రభావం వల్ల అప్పటి వరకు కటిక దరిద్రంలో ఉన్న వాడు సైతం.. అపర కుబేరుడిగా మారిపోతాడు. ముఖ్యంగా పారిజాతయోగం అనేది అత్యంత శక్తివంతమైందని పండితులు చెబుతున్నారు.
పండితులు ప్రకారం.. ఈ సారి మనకు పారిజాతయోగం అనేది 62 ఏళ్ల తర్వాత.. ఏప్రిల్ మాసం 19న ఏర్పడబోతుంది. ముఖ్యంగా పారిజాతయోగం శ్రీ మహా విష్ణువుకు సంబంధించిందని పండితులు చెప్తున్నారు . దీని ప్రభావం ద్వాదశరాశులపై ఉంటుంది. ముఖ్యంగా ఒక మూడు రాశుల వారికి మాత్రం ముట్టుకున్నదంతా బంగారం అని చెప్పుకొవచ్చు.
కన్య.. ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. విదేశీయానానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెద్దల నుంచి ఆస్తులు దక్కుతాయి. కోర్టు కేసుల్లో విజయాలను సాధిస్తారు.
తుల..ఈ రాశి వారికి నచ్చిన అమ్మాయితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. స్నేహితులు, బంధువులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మకరం.. వీరికి పారిజాతయోగం వల్ల భూములు, సొంత ఇల్లు కొనుగోలు శక్తి పెరుగుతుంది. అదే విధంగా సంఘంలో వీరికి పలుకు బడి కల్గిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పాలిటిక్స్ లో రాణిస్తారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి కాలం అని చెప్పుకొవచ్చు.