RRB Recruitment: రైల్వేలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) భారతీయ రైల్వేలో మరో 2,570 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30.
1/5భారతీయ రైల్వేలో పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశంలోని అన్ని ఆర్ఆర్బీల్లో కలిపి మొత్తం 2570 పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA)లో జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టులను భర్తీ చేయనున్నారు.
2/5విద్యార్హతలు ఇలా ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
3/5ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి ప్రారంభ తేది అక్టోబర్ 31 కాగా.. చివరి తేది నవంబర్ 30.
4/5అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు రూ.250. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500.
5/5రెండు దశల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు rrbguwahati.gov.in వెబ్సైట్ని సందర్శించండి.