School Holiday Extends Another Two Days In Nellore And Chittoor: విద్యార్థులకు భారీ అలర్ట్. మళ్లీ పాఠశాలల సెలవులు పొడిగించారు. ఇప్పటివరకు వచ్చిన సెలవులు కాకుండా మరిన్ని సెలవులు వచ్చాయి. మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా ఏపీ వ్యాప్తంగా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1/6భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలోనే వర్షాలతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
2/6ఇప్పటికే కొన్ని జిల్లాలకు సెలవులు ప్రకటించగా తాజాగా మరికొన్ని జిల్లాలకు ఏపీ ప్రభుత్వం సెలవు ఇచ్చింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది.
3/6మొంథా తుఫాన్ తీరం దాటుతుండడంతో భారీ నుంచి అతి భారీ నుంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇంకొన్ని జిల్లాలకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.
4/6కాకినాడలో ఈనెల 31వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షాల నేపథ్యంలో అక్కడ సెలవులు కొనసాగుతున్నాయి.
5/6విశాఖపట్టణం, వైఎస్సార్ కడప, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్డీఆర్, గుంటూరు, అల్లూరి, విజయనగరం, మన్యం, అనకాపల్లి, బాపట్ల, అల్లూరి జిల్లాలో మూడు రోజులు సెలవులు ఇచ్చారు.
6/6ఏపీ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. కానీ కర్నూలు, అనంతపురం జిల్లాలకు మాత్రం ఎలాంటి సెలవు లేదు.