Shalini Pandey Viral Comments: అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే సంచలన కామెంట్స్ చేశారు. ఓ దక్షిణాది సినిమాలో నటిస్తున్నప్పుడు ఆమెకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే ఓ వైరల్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభావాలను ఆమె పంచుకున్నారు. ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఓ దక్షిణాది సినిమాలో తాను నటిస్తున్న సమయంలో తన అనుమతి లేకుండానే ఓ డైరెక్టర్ తాను దుస్తులు మారుస్తున్న సమయంలో నేరుగా క్యారవాన్ డోర్ తీశాడని వాపోయింది.
తాను అప్పుడు వెంటనే సదరు డైరెక్టర్పై కేకలు వేయడంతో అతడు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ డైరెక్టర్ తీరు నన్ను ఎంతగానో బాధపెట్టింది అంటూ షాలినీ పాండే చెప్పుకొచ్చింది.
కాగా షాలినీ పాండే 'అర్జున్ రెడ్డి' (2017)లో విడుదలైంది. ఆ తర్వాత మహానటి, మహరాజ్ వంటి పలు సినిమాల్లో కనిపించింది. తాజాగా ఈమె డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్లో నటించింది.
ఆ వెబ్ సిరీస్ చాలా మందిని ఆకట్టుకుంది. ఇందులో సీనియర్ యాక్టర్ షబ్నా అజ్మీ కూడా నటించారు. ఈమె మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో 1993 సెప్టెంబర్ 23లో పుట్టింది. ఇక ఈమె అరంగేట్రం చేసిన అర్జున్ రెడ్డి కూడా రికార్డు బ్రేక్ చేసిన సంగతి తెలిసింది. ప్రస్తుతం హిందీలో ఈమె నటిస్తోంది.