Shardiya Navratri 2025: దేవీ శరన్నావరాత్రుల పూజలు దేశ వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. చాలా మంది భక్తిభావనలతో అమ్మవారిని కొలుచుకుంటున్నారు. భక్తులకు వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు.
1/6
దుర్గపూజలు:
హిందు సంప్రదాయంలో శారదీయ నవరాత్రులకు చాలా విశిష్టత ఉంది. ఈ నవరాత్రుల్ని అత్యంత భక్తి భావనలతో, నియమనిష్టలతో జరుపుకుంటారు. చెడుపై మంచి గెలిచిన దానికి సూచికగా దసరా పండగను జరుపుకుంటారు.
2/6
సరస్వతిపూజలు:
అయితే.. నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రూపాల్లో మనకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో అన్ని రోజులు కూడా అత్యంత ముఖ్యమైనవి. కానీ దానిలో మూల నక్షత్రం వచ్చే రోజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైందని పండితులు చెబుతారు. ఈ మూల నక్షత్రం అనేది మహాసరస్వతి అమ్మవారి జన్మనక్షత్రం. అందుకే దీని అంతటి మహత్తు ఉంది.
3/6
మూల నక్షత్రం:
ఈసారి మనం మూల నక్షత్రంను సెప్టెంబర్ 30న మూల నక్షత్రం పూజల్ని జరుపుకోబోతున్నాం. ఈ రోజున దుర్గమ్మతల్లిని సరస్వతి అమ్మవారిలా అలంకరణ చేస్తారు. ఈరోజు చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకుంటారు. అంతే కాకుండా తమ పిల్లలకు పలక మీద ఓంకారంను కూడా గుడిలో వెళ్లి పూజారులతో రాయించుకుంటారు.
4/6
శారదీయ నవరాత్రులు:
అంతేకాకుండా చాలా మంది ఈ రోజు హోమాలు, ప్రత్యేకంగా సరస్వతి అనుగ్రహం కోసం పూజలు చేయించుకుంటారు. ఈ రోజున అక్షరాభ్యాసం చేయించుకుంటే విద్యలో రాణిస్తారని, జీవితంలో మంచి ఉన్నత స్థానానికి వెళ్తారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
5/6
శరన్నావరాత్రులు దుర్గాపూజలు:
ఈ క్రమంలో మూల నక్షత్రంరోజు మిగత రోజుల్లో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాల కంటే.. వెయ్యి రెట్లు గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. అందుకే చాలా మంది మూల నక్షత్రంరోజున శక్తి పీఠాలు కానీ అమ్మవారి ఆలయాలను దర్శించుకుంటారు.
6/6
దుర్గపూజలు:
మూల నక్షత్రం రోజున తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. ముఖ్యంగా..ఈ రోజున చిన్న పిల్లలకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ చేస్తే చదువులో వస్తున్న ఆటంకాలు అన్ని కూడా దూరమౌతాయి. అంతే కాకుండా విద్యా, ఉద్యోగ రంగంలో అత్యద్భుతంగా రాణిస్తారు.