Add Zee Business As A Preferred Source
App

Smriti Mandhana: స్మృతి మంధాన వీరవిహారం.. వన్డేల్లో రికార్డుల మోత మోగించిన క్రికెట్ క్వీన్.. కోహ్లీ రికార్డ్‌ కూడా బద్దలు

Written ByAruna Maharaju
Published: Sep 21, 2025, 02:11 PM IST|Updated: Sep 21, 2025, 06:32 PM IST

Smriti Mandhana: ఇండియా మహిళ జట్టు వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. శనివారం మూడవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టైలీష్ బ్యాటర్ స్మృతి మంధాన వీరవిహారం చేసింది. కేవలం 63 బంతుల్లోనే 125 రన్స్ చేయగా.. అందులో 17 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఈ ఏడాది నాలుగు సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి రికార్డ్ క్రియేట్ చేసింది.
 

Smriti Mandhana Record1/5

స్మృతి మంధాన

భారత మహిళల క్రికెట్ జట్టు, ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో శనివారం మూడో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటర్ స్మృతి మంధాన అద్భుతంగా ఆడింది. కేవలం 63 బంతుల్లో 125 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.   

Smriti Mandhana 2/5

స్మృతి మంధాన వీరవిహారం

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసింది. ఆ జట్టులో బెత్ మునీ 75 బంతుల్లో 138 పరుగులతో రాణించి, జట్టు స్కోరు 400 దాటడానికి సాయం చేసింది. భారత జట్టు 413 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది.   

Smriti Mandhana Record3/5

స్మృతి మంధాన రికార్డు

బరిలోకి దిగిన స్మృతి మంధాన దూకుడుగా ఆడింది. మూడో ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు, ఐదో ఓవర్‌లో ఒక సిక్సర్, ఒక ఫోర్, ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టింది. ఆ తర్వాతి ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదింది. ఇలా కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ, 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసింది.   

Smriti Mandhana  4/5

స్మృతి మంధాన రికార్డు

ఈ సెంచరీతో మహిళల వన్డే క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా స్మృతి రికార్డు సృష్టించింది. అలాగే, విరాట్ కోహ్లీ 52 బంతుల్లో చేసిన రికార్డును బద్దలు కొట్టి, వన్డేల్లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా కూడా నిలిచింది.  

Smriti Mandhana Record5/5

టీమిండియా స్టైలీష్ బ్యాటర్ స్మృతి మంధాన

స్మృతి మంధాన మహిళల వన్డేల్లో 13 సెంచరీలతో సుజీ బేట్స్‌తో కలిసి రెండో స్థానంలో ఉంది. మెగ్ లానింగ్ 15 సెంచరీలతో మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది నాలుగు సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి నిలిచింది. అయితే, స్మృతి అద్భుతంగా ఆడినప్పటికీ, భారత జట్టు 47 ఓవర్లలో 369 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.