Actress Sobhita Dhulipala: అక్కినేని నాగార్జున పెద్ద కోడలు, హీరోయిన్ శోభితా ధూళిపాళ.. హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మ్యారేజ్ తర్వాత ట్రెడిషనల్ లుక్లో అదరగొడుతుంది శోభితా. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న శోభిత.. పట్టుచీరలో మెరిసిపోయింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని నాగచైతన్య భార్య శోభితా ధూళిపాళ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. రామన్ రాఘవన్ అనే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత.. బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది.
ఇక తెలుగులో మేజర్, గూఢాచారి సినిమాల్లో నటించిన శోభితా.. పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాలతో తమిళంలోనూ మెప్పించింది. పెళ్లి తర్వాత కాస్తా గ్యాప్ తీసుకుంది ఈ నటి.
నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత శోభితా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడూ తన అప్డేట్స్ను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే మ్యారేజ్ తర్వాత అప్పుడప్పుడూ ట్రెడిషనల్ లుక్లో మెరిసిపోతుంది శోభిత.
ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభితా ధూళిపాళ.
2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.