Amavasya: సాధారణంగా ప్రతి మాసంలోను రెండు అమావాస్య తిథులు వస్తాయి. ఈ సారి చైత్రమాసం చివరన అంటే.. 27 వ తేదీన అమావాస్య ఏర్పడబోతుంది. ఈ రోజున కొన్ని గ్రహాల అరుదైన కలియకల వల్ల వీటి ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది.
జ్యోతిష్య పండితుల ప్రకారం అమావాస్య అనగానే చాలా మంది అదేదో చెడుఫలితాలను ఇస్తుందని భావిస్తారు. కానీ అమావాస్య అనేది చెడును కూడా పొగొడుతుంది. మనం దీపావళిని చెడు మీద మంచి గెలిచినందుకు గుర్తుగా జరుపుకుంటాం. అంతే కాకుండా.. ఈరోజున కొన్ని పనులు స్టార్ట్ చేస్తే అవి అస్సలు ఆగకుండా పూర్తవుతాయంట.
ముఖ్యంగా అమావాస్యను చాలా మంది ఎంతో శక్తివంతమైనదిగా చెప్తుంటారు. ఈరోజున కొన్ని పనులు చేస్తే అది జీవితంలో పెనుమార్పులకు కారణమౌతుంది. ఈ సారి మనం ఏప్రిల్ 27వ తేదీన అమావాస్యను జరుకుబోతున్నాం. ఈ రోజున ఆదివారం అశ్వని నక్షత్రం అది కూడా అమావాస్య ఏర్పడబోతుంది. దీని వల్ల కొన్ని రాశులలో ఊహించని ధనలాభం,ఐశ్వర్యంకల్గబోతుంది.
మిథున రాశి..ఈ రాశి వారికి సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో గుర్తింపులు లభిస్తుంది.కోర్టు కేసుల్లో విజయాలను సాధిస్తారు. మీకు పెళ్లి కుదిరే చాన్స్ కన్పిస్తుంది.
మకరం రాశి..ఈ రాశి వారు సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. రియల్ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. మీరుఎన్నోఎళ్ల నుంచి ఎదురుచూసిన పనులు పూర్తవుతాయి. మీ వల్ల లాభాలు పొందిన వారు మీకు అండగా ఉంటారు. విదేశీయానానికి అవకాశం ఉంది.
మీనం..ఈ రాశివారు భూమికి సంబంధించిన లావాదేవీల్లో సక్సెస్ ను సాధిస్తారు. మీరు అనుకున్న రేట్లకు భూముల్ని దక్కించుకుంటారు. రాజకీయాల్లో పలుకుబడి కల్గిన వారితో పరిచయాలు ఏర్పడుతాయి. విదేశీయానానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. భారీగా డబ్బుల్ని అర్జిస్తారు.