Tirumala Darshan Tickets June 202 Quota: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం టిక్కెట్లు, గదులను బుక్ చేసుకునే షెడ్యూల్ వచ్చింది. వెంటనే బుక్ చేసుకోండి. ఏ రోజు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి తెలుసుకుందాం..
మార్చి 22వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి టిక్కెట్లు విడుదల చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన కోటా విడుదల చేయనున్నారు.
మార్చి 24న ఉదయం 10 గంటలకు జూన్ నెలకు సంబంధించిన కోటా విడుదల చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి గదుల బుకింగ్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం గదుల బుకింగ్, ఆన్లైన్లోనే చేసుకోవాలి. అయితే, ఫేక్ వెబ్సైట్లను నమ్మి మోసపోకండి అని ఇటీవల టీటీటీ తెలిపింది. కేవలం https://ttdevasthanam.ap.gov.in వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి.