Tirumala Pattu Dupatta Scam: తిరుమల శ్రీవారి చెంత మరో బిగ్ స్కామ్ బయటపడింది. ఇప్పటికే లడ్డులో నెయ్యి కల్తీ, పరకామని అక్రమాల కేసు కొనసాగుతున్న నేపథ్యంలో భారీ స్కాం బయటపడింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి దేవస్థానంలో గత దశాబ్ద కాలంగా ఈ స్కామ్ జరుగుతోంది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టు అంగవస్త్రాల (సారిగ దుపట్టా) కొనుగోలులో భారీ మోసం జరిగినట్టు తిరుమల విజిలెన్స్ గుర్తించింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
తిరుమల వేద ఆశీర్వాచనంలో భారీ మోసం బయటపడింది. ప్రముఖులకు ఇచ్చేపట్టు అంగవస్రాల సరిగా దుపట్టా కొనుగోలులో భారీ మోసం జరిగింది. రూ.100 విలువల చేయని ఒక పాలిస్టర్ క్లాత్ ను రూ.1400కు సరఫరా చేసినట్లు బోర్డుకు టీటీడీ విజిలెన్స్ తెలిపింది. 2015 నుంచి 2025 వరకు ఇలా శ్రీవారి ఖజానా నుంచి దాదాపు రూ.54 కోట్లు దోచుకుంది.
ఒకవైపు లడ్డు మరోవైపు పరకామణి కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో మరో భారీ మోసం బయటపడింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో కొన్ని వందల కోట్లు దోచుకుంటున్నారు. సిల్క్ క్లాత్ని పట్టు వస్త్రంగా చూపించి కోట్లు దోచారు.
ఈ దుపట్టా మోసం కేసును యాంటీ కరెక్షన్ బ్యూరోకు రెఫర్ చేశారు. ఈ స్కామ్కు సంబంధించిన వివరాలను అందించారు. సాధారణంగా టీటీడీ సిల్క్ దుపట్టాను తిరుమల దాతలు భక్తులకు వేద ఆశీర్వచనాలు ఇచ్చే సమయంలో రంగనాయకులు మంటపం వద్ద వీఐపీ బ్రేక్ దర్శనం వారికి దాతలకు అందజేస్తారు.
వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ కొనుగోలుదారులకు కూడా ఈ దుపట్టాతో సత్కరిస్తారు. ఇక తిరుమల చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ భారీ స్కామ్ బట్ట బయలు చేశారు. టెండర్ దక్కించుకున్న వారు కోట్లలో మోసం చేశారు. అయితే తిరుమల నిబంధనల ప్రకారం మల్బరీ సిల్క్ ద్వారా మాత్రమే ఈ దుపట్టాలను తయారు చేయాలి.
ప్రతి ఒక్క అంగవస్త్రంపై 'ఓం నమో వెంకటేశాయ' అని సంస్కృతంలో రాసి ఉంటుంది. మరోవైపు తెలుగులో కూడా ఉంటుంది. శంకు, చక్ర, నామాల సింబల్స్ తో సూచించి సైజు, బరువు బార్డర్ డిజైన్ తో రూపొందిస్తారు. అయితే నాసిరకం పాలిస్టర్ వస్త్రాన్ని పట్టు వస్త్రంగా సరఫరా చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది.
దీనిపై ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించింది. సంబంధిత స్కామ్లో ఉన్న ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని బీఆర్ నాయుడు తెలిపారు. ఇక విజిలెన్స్ అధికారులు కూడా శాంపిల్స్ సేకరించి ఫ్రెష్ స్టాక్ను తీసుకువచ్చే పనులు చేపట్టారు. అయితే ఈ దుపట్టాలను నగరీకి చెందిన వీఆర్ఎస్ ఎక్స్ పోర్ట్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. పది సంవత్సరాలుగా వీళ్లు సరఫరా చేస్తున్నారు. బెంగళూరులోని సిల్క్ బోర్డుకు లాబరేటరీకి ఈ శాంపిల్ను తరలించారు