India’s Fastest Train: రైల్వే కనెక్టివిటీని పెంచడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశంలో రైల్వేలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజుల్లో హైడ్రోజన్ రైలు, మెట్రో, రాపిడ్ రైలు మరియు వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి ఆధునిక ఎంపికలు.. ప్రయాణీకులకు వేగవంతమైన, సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. మరి వీటన్నింటిలో ఏది ఎక్కువ స్పీడ్తో ప్రయాణిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1/5హైడ్రోజన్ ట్రైన్: ఇండియా త్వరలో తన తొలి హైడ్రోజన్ ట్రైన్ని ప్రారంభించబోతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలు. ఈ ట్రైన్ హర్యానాలోని జింద్ మరియు సోనిపట్ మధ్య గంటకు 110 నుండి 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే.. ఈ హైడ్రోజన్ రైలు నుండి వచ్చే పొల్యూషన్ జీరో. కాబట్టి ఈ ట్రైన్ పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
2/5మెట్రో: భారతదేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో రవాణాకు మెట్రో రైలు వెన్నెముక లాంటిది. ఇక ఢిల్లీ మెట్రో దేశంలోనే అతిపెద్ద మెట్రో వ్యవస్థ. ఇక మెట్రో గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. మెట్రో తక్కువ దూరాలు మరియు నగరాల కోసం నిర్మించబడినందున.. దాని సగటు వేగం గంటకు 50 కిలోమీటర్ల చుట్టూ ఉంటుంది.
3/5రాపిడ్ రైల్: ఇప్పుడు 'నమో భారత్' అని పిలువబడే రాపిడ్ రైల్.. ఢిల్లీ, మీరట్ వంటి మార్గాల కోసం నిర్మించబడింది. దీని గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఇది కేవలం 50 నిమిషాల్లో 82 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు.
4/5వందే భారత్ ఎక్స్ప్రెస్: ప్రైడ్ ఆఫ్ ఇండియా వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైలు. గరిష్ట వేగం గంటకు 180 కి.మీ. కానీ సగటు వేగం మాత్రం గంటకు 83-96 కి.మీ.
5/5ఏ రైలు వేగం ఎక్కువ: వందే భారత్ ఎక్స్ప్రెస్ మరియు రాపిడ్ రైల్ రెండింటి వేగం దాదాపు సమానంగా ఉంటుంది. రాపిడ్ రైల్ గరిష్ట వేగం గంటకు 180 కి.మీ అని చెబుతారు కానీ ప్రస్తుతం దీనిని 160 కి.మీ వేగంతో పరీక్షించారు. వందే భారత్ గరిష్ట వేగం గంటకు 180 కి.మీ. అయితే.. రైల్వే ట్రాక్పై మాత్రం 160 కి.మీ. వేగంతో నడపడానికి అనుమతించబడింది. ఇది రైల్వే ట్రాక్పై ఆధారపడి ఉంటుంది. రాపిడ్ రైల్ మరియు వందే భారత్ అత్యంత వేగవంతమైనవి. వందే భారత్ సుదూర ప్రయాణం కోసం.. రాపిడ్ రైల్ మధ్యస్థ దూర ప్రయాణం కోసం తయారు చేయబడింది.