Be Alert: హైదరాబాద్ను వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో ఆసుపత్రులకి జనాలు క్యూ కడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
1/5గ్రేటర్ పరిధిలో విష జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య బాగా పెరిగింది. ఒకరికి ఈ లక్షణాలు వస్తే, కుటుంబంలో మిగతా వారికి కూడా త్వరగా వ్యాపిస్తున్నాయి.
2/5వాతావరణంలో వచ్చిన మార్పులే ఈ సీజనల్ వ్యాధులకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. చిన్న పిల్లలు మొదలు పెద్దవారి వరకు అందరూ జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒంటినొప్పులతో బాధపడుతున్నారు.
3/5ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రుల్లో రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణం కంటే 50 శాతం ఎక్కువ మంది రోగులు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
4/5చల్లని వాతావరణం వల్ల ఫ్లూ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్ జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ శ్రీహర్ష యాదవ్ తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రిలో కూడా చిన్న పిల్లల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే వర్షాకాలం, చలికాలంలో ఇలాంటి వ్యాధులు సహజమని.. ఈ సంవత్సరం రోగుల సంఖ్య గతంతో పోలిస్తే తక్కువగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
5/5లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి, రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ సూచించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరైన చికిత్సతో త్వరగా ఆరోగ్యం పొందవచ్చని వారు తెలిపారు.