JanaSena Party: జయకేతన సభ గ్రాండ్‌ సక్సెస్‌.. టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్‌

JanaSena Party Jayaketana Sabha Photos: రాజకీయ పార్టీ పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించింది. పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన సభతో టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్‌ ఇచ్చింది. ఏమిటి? ఎందుకో తెలుసుకుందాం.

1 /8

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలకంగా మారిన జనసేన పార్టీ 11వ వార్షికోత్సవం చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది.

2 /8

పీ రాజకీయ చరిత్రలో జనసేన పార్టీ ఇంతటి భారీ బహిరంగ సభ నిర్వహించడం ఇదే తొలిసారి. జయకేతనం పేరిట నిర్వహించిన ఈ సభ విజయవంతమైంది. సభ సక్సెస్‌తో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగాయి.

3 /8

చిత్రాడలో నిర్వహించిన బహిరంగ సభ భారీ విజయం కావడంతో మిత్ర పక్షాలతోపాటు ప్రతిపక్ష పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ బహిరంగ సభ ద్వారా భవిష్యత్‌లో జనసేన పార్టీ బలీయమైన శక్తిగా చాటి చెప్పేందుకు ప్రయత్నించారు.

4 /8

జయకేతనం సభకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి అభిమానులు తరలివచ్చారు. వేలాది మధ్య జరిగిన ఈ సభతో ఇతర పార్టీలకు జనసేన పార్టీ గట్టి హెచ్చరిక చేసినట్టు భావించవచ్చు.

5 /8

జయకేతనం సభలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కొన్ని గంటల పాటు ఆ కార్యక్రమాలు కొనసాగగా.. నాగేంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌తోపాటు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక ప్రసంగం చేశారు.

6 /8

ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ బహిరంగ సభతో జనసేన పార్టీ ఇతర పార్టీలకు ఓ సందేశం ఇచ్చింది. భవిష్యత్‌ మొత్తం జనసేన పార్టీదేనని ఈ సభ ద్వారా ఆ పార్టీ చాటి చెప్పిందని భావించవచ్చు.

7 /8

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ గడ్డపైన ఏర్పడినా కూడా జనసేన పార్టీ నేటి విభజిత ఆంధ్రప్రదేశ్‌పైనే ప్రధాన దృష్టి సారించింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలకంగా జనసేన పార్టీ మారిన విషయం తెలిసిందే.

8 /8

2014 ఎన్నికల్లో పోటీ చేయకపోగా.. 2019లో పోటీ చేసి ఘోర పరాభవం ఎదుర్కొన్న జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. 21 ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒకరు ఎమ్మెల్సీ జనసేన పార్టీకి ఉన్నారు.