)
Dead Rat Found In Paneer Curry: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బదౌన్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే ఓ ధాబాలో భోజనం చేస్తుండగా.. పనీర్ కూరలో చనిపోయిన ఎలుక కనిపించింది. అయితే అప్పటికే ఆ వ్యక్తి సగం ఎలుకను తినేశాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది.
దీని తర్వాత ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అతను కోరాడు. పనీర్ కూరలో చనిపోయిన ఎలుక కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నెట్టింట చాలా మంది హోటల్ నిర్వాహకులపై మండిపడుతున్నారు.
ఏం జరిగిందంటే?
బదౌన్ నివాసి అయిన నిశాంత్ మహేశ్వరి.. స్థానికంగా ఉండే బిల్సి పట్టణంలో ఓ ధాబాకు తినేందుకు వెళ్లాడు. ఈ సమయంలో అతను పనీర్ కర్రీ, రోటీని తినేందుకు ఆర్డర్ చేశాడు. ప్రశాంతంగా కూర్చొని తినే సమయంలో ప్లేట్ లో వింత వస్తువు కనిపించింది. దాన్ని చెంచాతో తిప్పి చూస్తే దెబ్బకి షాక్ అయ్యాడు. తాను ఎంతో ఇష్టంగా తినే పనీర్ కర్రీలో చనిపోయిన ఎలుకు ప్రత్యక్ష్యం అవ్వడంతో అతడు బిత్తరపోయాడు. అప్పటికే అతడు కొంచెం కర్రీని తినేసినట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై ఆ హోటల్ యజమానికి ఫిర్యాదు చేయగా.. సరైన సమాధానం రాలేదు. దీంతో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే ఆ ధాబాపై ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అయితే ఆహార శాఖ నిర్లక్ష్యం కారణంగా సరైన ప్రమాణాలు పాటించని హోటల్స్ ను తనిఖీ చేసి వాటికి సర్టిఫై చేయాలి.
కానీ, ఆ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ విధమైన ప్రమాదకర సంఘటనలు బయటపడుతున్నాయని బాధితుడు అభిప్రాయపడ్డాడు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చినా.. వాటిపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని బాధితుడు వెల్లడించాడు. ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook