Viral Video: వింత ఘటన.. గోతి తవ్వుకుని పూడ్చి పెట్టుకున్న భార్యాభర్తలు.. నెట్టింట్లో వీడియో వైరల్..

Latest Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని ఓ జిల్లాలో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధ భార్యాభర్తలిద్దరూ గోతులు దవ్వుకొని పూడ్చి పెట్టమని స్థానికులను అడగడానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 20, 2025, 06:12 PM IST
Viral Video: వింత ఘటన.. గోతి తవ్వుకుని పూడ్చి పెట్టుకున్న భార్యాభర్తలు.. నెట్టింట్లో వీడియో వైరల్..

Latest Viral Video Watch Here: ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో జిల్లాలోని పాట్లాపూర్ గ్రామంలో ఓ వింత సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మంగళవారం వృద్ధ దంపతులు తమ ఇంటి పక్కనే ఒక పెద్ద గుంతను తవ్వి.. అందులో వారిద్దరిని పూడ్చమని ఇతరులను కోరడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఆ వృద్ధ దంపతులు ఇలా సజీవ సమాధి ఎందుకు కావాలనుకుంటున్నారో? అసలు అక్కడ ఏం జరిగిందో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

పాట్లాపూర్ గ్రామంలో ఆ వృద్ధులు గతంలో ప్రభుత్వానికి సంబంధించిన ఓ భూమిలో చిన్న ఇల్లు నిర్మించుకుంటారు. అయితే దీనిని గుర్తించిన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ వృద్ధ భార్యాభర్తలిద్దరూ కలిసి తమ ఇంటి పక్కనే ఉన్న ప్రాంతంలో ఒక తవ్వి, వారికి వారే అందులో దిగి సజీవంగా పోర్చమని స్థానికులను అడుగుతారు. దీంతో వారు గ్రామ శాఖ అధికారులకు సమాచారం  అందిస్తారు..

గ్రామ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని వారిద్దరిని ఆ గుంతలో నుంచి తీసే ప్రయత్నం చేస్తారు. గ్రామ సభలో భాగంగా వారు ఆక్రమించిన భూమిని సేకరించడంతోనే ఈ వృద్ధ జంట ఇలా నిరసన తెలిపిందని స్థానిక అధికారులు తెలుపుతున్నారు. అయితే ఆ అధికారులు కూడా కాస్త భయాందోళనకు గురై జిల్లాస్థాయి అధికారులకు సమాచారం అందించగా వారు కూడా అక్కడికి చేరుకున్నారు. సాలెంపూర్ SDM దిశా శ్రీవాస్తవ సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ దంపతులకు చట్టాన్ని వివరించడానికి ప్రయత్నించారు

బాధిత రమణరేష్ భార్య గుచ్చి దేవి ఆ భూమి పై ఎన్నో ఆశలు పెట్టుకోవడంతో ఎంతో బాధకు గురై.. ఏ అధికారి వచ్చిన మా యూపీ భూమిని, ఇల్లు తిరిగియలేమంటూ అధికారుకు వెల్లడించింది. అయితే జిల్లా స్థాయి అధికారులు ఎంతో కష్టపడి, గంటల తరబడి ఒప్పించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి వారి ఇంటికి తరలించారు. అంతేకాకుండా వారు ప్రభుత్వ భూమిలో కట్టుకున్నప్పటికీ వారి చుట్టుపక్కలే చాలా మంది కూడా ప్రభుత్వ భూముల్లో ఇళ్లను నిర్మించుకున్నారు వారిని ఏమాత్రం ఖాళీ చేయించకుండా.. తమపై వివక్షత చూపుతూ ఖాళీ చేయించడం సరైనది కాదని వృద్ధ దంపతులు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. వీటిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు అధికారులను ఓ ఆట ఆడుకుంటున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News