)
Man swept away during ganesh idol immersion in Haridwar: దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా గణపయ్య విగ్రహల్ని నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చాలా చోట్ల గణేష్ విగ్రహల నిమజ్జనంకు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. తమ ఇంట్లో భక్తితో ఇన్ని రోజులు పెట్టుకున్న గణపయ్యల్ని .. అంతే గౌరవంతో చాలా మంది నిమజ్జనంకు విగ్రహాల్ని తరలిస్తున్నారు.
కొన్ని చోట్ల తప్పతాగి కూడా గణపయ్య విగ్రహల్ని తరలిస్తున్నారు. దీని వల్ల స్వామి వారి ఆగ్రహనికి గురౌతారని అందరు చెబుతున్నారు. అయిన కూడా చాలా మంది మాత్రం ఇప్పటికి కూడా విగ్రహల్ని అగౌరవ పరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. అయితే.. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి నదిలో ఒక వ్యక్తి కొట్టుకుని పోయాడు.
షాకింగ్ వీడియో
వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి
హరిద్వార్లో వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో గంగా నదిలో అదుపుతప్పి పడిపోయిన నిఖిల్ గుప్తా(38)
అక్కడ ఉన్నవారు సాయం కోసం అరుస్తుండగానే నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి
సమాచారం అందుకొని SDRF సిబ్బందితో… pic.twitter.com/8v7PLhYJIT
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2025
హరిద్వార్లో వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో గంగా నదిలో నిఖిల్ గుప్తా కాలు జారీ నీటి ప్రవాహంలో పడ్డాడు. అతను సాయం కోసం కేకలు వేస్తున్న కూడా ఎవరికి ఈత రాకపోవడంతో నీటిలో దిగే ధైర్యం చేయలేదు.
అయితే.. అతను అప్పటి వరకు గణపయ్య నిమజ్జనం వేడుకల్లో ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నాడు. కళ్ల ముందు నీటి ప్రవాహంలో కొట్టుకునిపోతుండగా కొంత మంది తమఫోన్ లలో ఈ ఘటనను వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే.. సమాచారం అందుకున్న SDRF సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు అతని ఆచూకీ లభించలేదని పోలీసులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.