Dual Marriage: ఇదేం సాంప్రదాయం..? ఒకే మండపంలో ఇద్దరమ్మాయిలతో యువకుడి పెళ్లి

One Groom Two Brides Get Married In Kumuram Bheem Asifabad District: ఆధునిక సమాజంలో యువకులకు వివాహాలు కావడం గండంగా మారిన సమయంలో ఒకచోట మాత్రం యువకులు ఇద్దరేసి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. మరోసారి ఓ యువకుడు ఇద్దరు యువతులను చేసుకోవడం వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 25, 2025, 05:24 PM IST
Dual Marriage: ఇదేం సాంప్రదాయం..? ఒకే మండపంలో ఇద్దరమ్మాయిలతో యువకుడి పెళ్లి

One Groom Two Brides: వివాహాలు కాక బ్రహ్మాచారులు పెరిగిపోతున్న ఈ ఆధునిక సమాజంలో ఒక జిల్లాలో మాత్రం యువకులు ఇద్దరేసి చొప్పున యువతులను వివాహమాడుతున్నారు. అదే ఒక ప్రాంతంలో మాత్రం ఇద్దరు యువతులు.. ఒక పెళ్లి కొడుకు వంటి వివాహాలు జరుగుతున్నాయి. తాజాగా మరో యువకుడు ఇద్దరు యువతులను వివాహమాడాడు. ఈ వార్తతో మరోసారి సోషల్‌ మీడియాలో పెళ్లి రచ్చ మొదలైంది. ఈ వైరల్‌ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Sabitha Reddy: భర్తను తలచుకుని భావోద్వేగానికి లోనయిన మాజీ మంత్రి సబితా రెడ్డి

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక యువకుడిని ఇద్దరు యువతులు వివాహం చేసుకునే సంప్రదాయం ఉంది. కొన్ని ఆదివాసీ సంస్కృతి సంప్రదాయంలో ఈ ఆనవాయితీ ఉంది. నెలకిందట ఓ యువకుడికి ఇద్దరు యువతులతో వివాహం కాగా తాజాగా మరో యువకుడికి అదే మాదిరి వివాహం జరిగింది. తాజాగా ఇలాంటి వివాహామే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read: KTR: లగచర్ల ఆడబిడ్డలకు సారీ చెప్పి రేవంత్‌ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి: కేటీఆర్‌

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని అడ్డేసరా గ్రామానికి చెందిన యువకుడు ఆత్రం ఛత్రుషవ్‌ గ్రామానికి చెందిన యువతులు జంగుబాయి, సోన్ దేవీలను ప్రేమించాడు. వారి ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పారు. ఇరు కుటుంబసభ్యులు వారి ప్రేమకు అంగీకారం తెలపడం వివాహం. వారి కుటుంబ సభ్యులను ఒప్పించి శుక్రవారం ఇద్దరిని ఒకే మండపంలో ఛత్రుషవ్‌ పెళ్లి చేసుకున్నాడు. ఆదివాసీ సాంప్రదాయాలతో డోలు, సన్నాయి వాయిద్యాల నడుమ తమ ఆచార వ్యవహారాలతో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల బంధుమిత్రులతోపాటు గ్రామస్తులు హాజరయ్యారు. ఆ యువకుడు ఇద్దరమ్మాయిలను బాగా చూసుకుంటానని, వారితో ఇక్కడే క్షేమంగా కాపురం కొనసాగిస్తానని పెద్దల సమక్షంలో మాట ఇచ్చాడు. అంతకుముందు ధూప దీప నైవేద్యం తమ ఆదివాసీ దేవుళ్లకు సమర్పించిన అనంతరం వివాహం జరిగింది.

గత నెలలోనే మొదటి వివాహం
ఒకే మండపంలో ఇద్దరమ్మాయిలను ఓ యువకుడు గత నెలలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 27వ తేదీన లింగాపూర్ మండలంలోని ఘుంనూర్ గ్రామానికీ చెందిన సిడాం సూర్యదేవ్ ఇద్దరు యువతులు జలకర్ దేవి, లాల్ దేవిలను ఒకే మండపంలో వివాహం చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

రెండుసార్లు ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇద్దరు యువతులతో ఒక యువకుడి వివాహం చేసుకున్న సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ రెండు వివాహాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు వీరి వివాహంలో వారికి తమ సాంప్రదాయ ఆచారాలతో కూడిన పెళ్లి వేడుక కార్యక్రమాలు జరగడం చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాహ వేడుకలపై నెట్టింట్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంచి ఉద్యోగం, అందం చందం ఉన్నా కూడా ఎవరూ పిల్లను ఇవ్వకపోవడంతో వయసు 35 దాటుతున్నా వివాహాలు కానీ పరిస్థితుల్లో ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇద్దరేసి యువతులతో వివాహాలు కావడంపై బ్రహ్మాచారులు లబోదిబోమంటున్నారు. 'మాకు ఒక అమ్మాయికే దిక్కు లేదంటే మీరేంట్రా బాబు ఇద్దరేసి అమ్మాయిలను చేసుకుంటున్నారు' అంటూ పెళ్లి కానీ ప్రసాద్‌లు కామెంట్లు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News