Womens passengers fighting each other in Mumbai train video: ప్రస్తుతం మనదేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో .. బస్సులు, రైళ్లు, విమానాలు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నారు. ఇక లోకల్ ట్రైన్ లు , మెట్రోల గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముంబై ట్రైన్ లలో రద్దీగా ఒక రెంజ్ లో ఉంటుదన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు కనీసం కాలు పెట్టడానికి సైతం జాగ ఉండదు.
ఇక మహిళలకు ప్రత్యేకంగా రైళ్లు ఉన్న కూడా దానిలో కూడా అదే సిట్యూవేషన్. ఈక్రమంలో ప్రస్తుతం ముంబైలోని లోకల్ ట్రైన్ లో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ముంబై మహిళల ప్రత్యేక రైలులో భారీగా రద్దీ నెలకొంది.
लोकलमध्ये महिलांमध्ये जुंपली,व्हिडीओ सोशल मिडियावर व्हायरल, हा व्हिडीओ कधीचा आहे याची माहिती अद्याप समोर आलेली नाही | Viral Video #Mumbai #Local #Video #Crime pic.twitter.com/syn8KTtfsi
— Ankita Shantinath Khane (@KhaneAnkita) June 20, 2025
ఇంతలో ఒక మహిళ రైలులోకి ఎక్కింది. లోపల ఉన్న మహిళ మాత్రం ఆమెకు లోనికి వెళ్లేందుకు స్థలం ఇవ్వలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త జుట్లు పట్టుకుని కొట్టుకొవడం వరకు కూడా వెళ్లింది. వారిద్దరు కూడా ఒకరిమీద మరోకరు పంచ్ లతో విరుచుకుపడ్డారు.తమ పదునైన గోర్లతో ఒకరి ముఖానికి మరోకరు రక్కుకున్నారు.
దీంతో ఒక మహిళకు ముఖం అంతా గోర్లు గీసుకుని పోవడంతో ఆమెకు ముఖం రక్తంతో నిండిపోయింది. అక్కడున్న వారు వీరి గొడవల్ని ఆపేందుకు ప్రయత్నించిన కూడా ఎవరు తగ్గడంలేదు. మొత్తంగా ఈ వీడియోను అక్కడున్న వారు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త ప్రస్తుతం వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









