)
After Raksha bandhan rakshi visarjan process: శ్రావణ పౌర్ణమి రోజున మనం అనాదీగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో రాఖీ రోజున సోదరులు, సోదరీమణులు ఒక చోటకు వచ్చి రాఖీ పండగ జరుపుకుంటారు. తమ సోదరుడికి రాఖీని కట్టి మరీ మంచి జరగాలని కోరుకుంటారు. కష్టసుఖాల్లో ఒకరికి మరోకరు అండగా ఉంటూ ఆనంద ప్రేమానురాగాల్ని పంచుతూ రాఖీ పండగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే.. కట్టిన రాఖీని ఎప్పుడంటే అప్పుడు తీయకూడదని పండితులు చెబుతుంటారు.
అక్కాచెల్లెమ్మలు కుడి చేతికి ఒక దేవుడి రక్షగా భావించి రాఖీని కడతారు. అయితే.. ఈ రాఖీని కొన్ని ప్రాంతాల్లో జన్మష్టామి వరకు కూడా తమ చేతిలో నుంచి తీయకుండా అలానే కాపాడుకుంటారు. శ్రీ కృష్ణుడు.. శిశుపాలుడ్ని తన సుదర్శన చక్రంతో అతని తలను వధించినప్పుడు.. కృష్ణుడి చేతికి గాయమౌతుంది.
అప్పుడు ద్రౌపది తన కొంగును చింపి మరీ కృష్ణుడి వేలికి రక్తం కారకుండా కట్టు కట్టుంది. అప్పుటి నుంచి ఎప్పుడు కష్టం కల్గిన తన వస్తానని ప్రమాణం చేస్తాడు. అన్నట్లు గానే కౌరవులు చీరను జూద సభలో వివస్త్రను చేయడానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు వచ్చి కాపాడతాడు. ఈ విధంగా కృష్ణుడికి రాఖీతో ప్రత్యేకంగా అనుబంధం ఉంది. అందుకే ఉత్తరాదిన కొన్ని చోట్ల జన్మష్టమి వరకు రాఖీని తీయరు.
అయితే.. చేతికి కట్టిన రాఖీని కనీసం ఒక ఐదురోజులైన పెట్టుకొవాలని పండితులు చెబుతుంటారు. అది మనకు ఒక పాజిటివ్ ధైర్యాన్ని, మానసిక శాంతిని ఇస్తుందని పండితులు చెబుతారు. రాఖీని బుధవారం లేదా శనివారం రోజున తీసి ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో మాత్రమే రాఖీని వేయాలి. లేదా ప్రవహించే నదిలో రాఖీని వేయాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook