)
Lunar Eclipse 2025: సెప్టెంబర్ 7వ తేది రాత్రి 8.58 గంటలకు గ్రహణం ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారు జామున 1.25 గంటల కొనసాగుతుంది. గ్రహణం నాడు ఎరుపు రంగులో ఉండే చందమామను బ్లడ్ మూన్ గా పిలుస్తారు. ఇది భారత దేశంలో రాజధాని ఢిల్లీ, ముంబై, లక్నో, హైదరాబాద్, చండీగఢ్ కోల్ కతా,పుణే ప్రాంతాల వారికి బాగా కనిపించనుంది. అటు ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, అమెరికా వంటి దేశాల్లో నేరుగా, స్పష్టంగా కనిపిస్తుంది.
సంపూర్ణ చంద్రగ్రహణం వివరములు.. ఇది రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం. ఈ గ్రహణం భారతదేశ మంతటా కనిపించును.
స్పర్శ కాలము రాత్రి గంటలు:-09:56 నిమిషములు.. నిమీలనకాలము రాత్రి గంటలు:-10:59 నిమిషములు.. మధ్య కాలము రాత్రి గంటలు:-11:41 నిమిషములు.. ఉన్మీలనకాలము రాత్రి గంటలు :- 12:22 నిమిషములు.. మోక్షకాలము రాత్రి గంటలు: 01:26 నిమిషములుండును.
గ్రహణ పుణ్య కాలము:-3 గంటల 30 నిమిషములుండును. బింబ దర్శన కాలము: 1 గంట 23 నిమిషాలుండును. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రములందు ముగియును. దీని వలన శతభిషo, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, కుంభరాశివారు ఈగ్రహణం చూడరాదని పండితులు చెబుతున్న మాట
ఉత్తరగోళం, అపసవ్యగ్రహణం, రాహు గ్రస్తం, పింగల వర్ణం, తూర్పు ఈశాన్యంలో స్పర్శయు, తూర్పు ఆగ్నేయములో నిమీలనము, దక్షిణ నైఋతిలో ఉన్మీలనము. పశ్చిమ నైఋతి పశ్చిమాసన్నమున ఈ గ్రహణము ముగుస్తుంది. గర్భిణీ స్త్రీలు యధావిధిగా ప్రశాంతంగా కదలకుండా నిద్రపోవలెను.
సింహారాశి,---కన్య రాశి,---తులరాశి..వృషభరాశి, మిధున రాశి,కుంభరాశి,మకరరాశి, మీనరాశివారికి ఈ గ్రహణము సమయం అంతగా బాగాలేదు. కనుక వీలైనంత ఎక్కువగా మహాశివ ఆరాధన చేయడం అత్యుత్తమం.
గ్రహణ సమయంలో పఠించవలసిని మంత్రాలు.. "ఓం సోమాయ నమః", "ఓం చంద్రాయ నమః", "ఓం నమః శివాయ" లేదా మీ ఇష్ట దైవం యొక్క మంత్రాలను జపించవచ్చు. ఈ సమయంలో ధ్యానం చేయడo, పాత అలవాట్లను వదిలించుకోవాలి. కొత్త ఉద్దేశాలను ఏర్పరచుకోవాలని చెబుతారు. గ్రహణం సమయంలో ఆయా మంత్రం జపించడం వల్ల విశ్వంలోని శక్తితో సమలేఖనం అవుతుందని సానుకూల ప్రభావాలు ఉంటాయని నమ్ముతారు.
పఠించదగిన కొన్ని మంత్రాలు:
ఓం సోమాయ నమః:, ఓం చంద్రాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ:,ఓం నమః శివాయ: లేదా మృత్యుంజయ మంత్రం జపించడం వలన గ్రహణ దోష బాధలు తొలుగిపోనున్నాయి. గ్రహణాన్ని చెడు సమయంగా భావిస్తారు, కాబట్టి గ్రహణం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. మంత్రం జపించడం వల్ల విశ్వశక్తితో అనుసంధానం ఏర్పడుతుందని, సానుకూల ప్రభావాలను పొందవచ్చని శాస్త్రం చెబుతుంది. ఈ సమయంలో గురు ముఖత మంత్రోపాసన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
ఈ సమయంలో మంత్ర జపం చేయడం వల్ల గ్రహణ సమయంలో ప్రసరించే కాస్మిక్ కిరణాల ప్రభావం నుండి రక్షణ లభిస్తాయని ..కోరిన కోరికలు నెరవేరుతాయాట. మేషరాశి-ధనస్సు రాశి, కర్కాటకరాశి,వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా బాగుంది.
దేవాలయాలు ఉదయం 12 గంటల లోపు నివేదనలు పెట్టుకొని దేవాలయము మూసి వేయాలి. మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 8తేదీ ఉదయం గణపతి పూజ,పుణ్యాహవచనము,పంచగవ్య సంస్కారము చేసి వాటితో విగ్రహములకు అభిషేకము చేయవలెను.7 తేదీ గ్రహణము రోజు తద్దినాలు పెట్టేవారు మధ్యాహ్నము 1-20 నిమిసాల లోపు పెట్టుకోవాలి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు లేదా మత గ్రంథాలు వంటి వివిధ మాధ్యమాల నుండి సేకరించి ఇవ్వబడిన విషయాన్ని మేము ఇక్కడ ప్రస్తావించాము. ఇది హిందూ పంచాంగాల ప్రకారం కరెక్ట్ అయిన.. జీ న్యూస్ మాత్రం ధృవీకరించడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.