)
Goddess Lakshmi Matha Birth Latest News: రామాయణంతోపాటు మహా భాగవతం అన్ని పురాణాలను తిప్పేస్తే తప్పకుండా ప్రతి దేవుడి దేవత పుట్టుక వెనుక ఉన్న అన్ని రహస్య వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వారికి సంబంధించిన ప్రాముఖ్యత ఇతర వివరాలను కూడా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి అమ్మవారి జన్మం వెనుక కూడా ఒక ప్రత్యేకమైన కథ ప్రచారంలో ఉంది. లక్ష్మీ అనే పేరు సాంస్కృతం పదం అయిన లక్ష్య నుంచి ఉద్భవించిందని అనేక పురాణాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ అమ్మవారిని అత్యంత శక్తివంతమైన సంపద దేవతగా చెప్పుకుంటారు. ముఖ్యంగా సిరి సంపదలకు, విజయానికి, సక్సెస్ కు ఇలా ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క పేర్లతో అమ్మవారిని పిలుచుకుంటారు. ఇలా పిలుచుకోవడాన్ని పురాణాల్లో అష్ట లక్ష్ములు గా పేర్కొన్నారు.
లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో ఎంత వారవుతారో అందరికీ తెలిసిందే. అందుకే చాలామంది లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు లక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల విజయం వరించడమే కాకుండా సుఖసంతోషాలు కలుగుతాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాగే పురాణాల్లో దుర్గాదేవి కూతురే లక్ష్మీదేవిగా పేర్కొన్నారు. అందుకే చాలామంది భక్తులు దుర్గామాతను అమ్మలగన్న అమ్మ అని ఎంతో భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రుల్లో భాగంగా కొలుస్తూ ఉంటారు. అలాగే ఆ మహావిష్ణువుకి సతీమణియే లక్ష్మీదేవి. ఈ అమ్మవారు విష్ణుమూర్తి ఏ అవతారం ఎత్తిన ప్రత్యేకమైన మారుపేరులతో ఆయన వెంటే ఉంటుంది. అయితే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరిందో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే క్షీరసాగర మధనం కథ తెలుసుకోవాల్సిందే.
దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి ఒక మహర్షి వచ్చి.. ఇంద్రుడికి అత్యంత పవిత్రమైన ఒక పెద్ద హారాన్ని గిఫ్టుగా ఇస్తాడు. అయితే ఇంద్రుడికి ఆ హారం ఆసక్తిగా అనిపించకపోవడంతో దానిని తన వద్ద ఉన్న ఒక పెద్ద ఐరావటానికి బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ ఐరావతం హారాన్ని కింద పడేసి దాని కాళ్ళతో తొక్కేస్తుంది.. దీనిని దుర్వాస మహర్షి ఎంతో అవమానంగా భావించి.. ఇంద్రుడిని శపిస్తాడు.. ఎలాంటి రాజబోగాలైతే చూసి మితిమీరిగా ఆనందిస్తున్నావో.. అవన్నీ లేకుండా పోతాయని మహర్షి ఇంద్రుడిని శపిస్తాడు.. అయితే దీంతో ఇంద్రుడు పాలిస్తున్న రాజ్యం అమరావతిలో ప్రజలు కష్టాలు ఎదుర్కోవడం ప్రారంభమవుతుంది. పరువు కాటకాలు ఎదురై.. ప్రజలు ఎంతగానో నష్టపోతు ఉంటారు.
అయితే ఇదే సమయంలో రాక్షసులంతా అమరావతి పై దండేత్తేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వారంతా ఇంద్రుడితో యుద్ధం చేసి పై చేయి సాధిస్తారు. దీంతో ఇంద్రుడి అమరావతిని రాక్షసులు సొంతం చేసుకుంటారు. ఇక ఇంద్రుడు చేసేదేమీ లేక అందరి దేవుళ్ళ దదగ్గరికి వెళ్లి వారితో కలిసి శ్రీమహావిష్ణువు దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ రాక్షసుల అరాచకాలను చెప్పుకొని పరిష్కారం సూచించాల్సిందిగా శ్రీమహావిష్ణువుని వేడుకుంటాడు. దీంతో శ్రీమహావిష్ణువు అందరి దేవుళ్లను సముద్రంలో క్షీరసాగర మధనం చేయాల్సిందిగా సూచిస్తారు.
ఇందులో భాగంగా ఒకవైపు రాక్షసులు మరోవైపు దేవుళ్ళు ఉంటారు. అయితే, ఇదే సమయంలో సముద్రం నుంచి తామర పువ్వు పై లక్ష్మీదేవి కూర్చొని ప్రత్యక్షమవుతుంది. ఈ అమ్మవారు దేవుళ్ళ వైపు నుంచి శ్రీమహావిష్ణువు దగ్గరికి చేరుతుంది. దీని కారణంగా దేవుళ్లంతా అద్భుతమైన శక్తిని పొంది రాక్షసులపై విజయం సాధిస్తారు. ఇలానే క్షీరసాగర మధనంలోంచి లక్ష్మీదేవి జన్మించిందిగా చెప్పుకుంటూ ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook