)
Shardiya durga navratri celebrations: దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను మనం సోమవారం నుంచి ఎంతో భక్తితో జరుపుకుంటాం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరాను జరుపుకుంటాం. ఈ క్రమంలో సెప్టెంబర్ 22 నుంచి 30 వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా శరన్నావరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.
ముఖ్యంగా అమ్మవారు తొమ్మిదిరోజుల్లో తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అయితే.. అమ్మవారి శరన్నావరాత్రి ఉత్సవాల్ని ఎంతో నిష్టతో చేస్తారు. చాలా మంది 9 రోజుల పాటు మాలను వేసుకుంటారు. ఈ సమయంలో ఇతరుల ఇంటికి భోజనంకు వెళ్లడం లేదా బైట ఫుడ్ తినడం వంటివి చేయకూడదు.
మద్యం, మాంసాహరాలకు దూరంగా ఉండాలి. ఘటస్థాపన చేసేవారు చెప్పులు ధరించకూడదు. అంతేకాకుండా గ్రామం విడిచి ఇతరప్రదేశాలకు వెళ్లకూడదు. చెడు ఆలోచనలు, గొడవలకు దూరంగా ఉండాలి. ఎప్పుడు కూడా అమ్మవారిని ధ్యానిస్తు అష్టోత్తరం, లలిత సహస్ర నామం, దుర్గాసప్తశతి, కుంకుమార్చనలు వంటివి పారాయణ చేస్తు ఉండాలి.
తొమ్మిది రోజుల పాటు చాలా మంది ఎర్రటి వస్త్రాలు వేసుకుంటారు. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో కటింగ్ చేసుకొవడం కానీ, గొర్లు కత్తిరించుకొవడంకూడా చేయకూడదు.
ఎప్పుడు కూడా అమ్మవారిని ధ్యానిస్తు, మనస్సులో కామపు ఆలోచనలు రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇతర పూజలు, వ్రతాల కన్నా కూడా నవరాత్రుల్లో దుర్గమ్మపూజలు చాలా జాగ్రత్తగా చేయాలని పండితులు చెబుతారు. అందుకే చాలా మంది శారదీయనవరాత్రులను ఎంతో నియమాలు, నిష్టలతో నిర్వహిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook