)
Importance Of Dussehra: తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. భక్తులు దుర్గమ్మ పూజలో లీనమయ్యారు. నవరాత్రి 9 రోజులను హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసం శుక్ష పక్షంలో అష్టమి తిథి రోజున దుర్గాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఆ రోజున మహాగౌరి అమ్మవారు.. చండ, ముండ అనే రాక్షసుల సంహారం చేసింది.
సెప్టెంబర్ 30 (మంగళవారం)న దసరా పండుగ..
ఈ నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవిని 9 రూపాల్లో విశేషంగా పూజలు చేస్తారు. ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 30వ తేదీన దుర్గాష్టమి పండుగను జరుపుకుంటున్నాము. అష్టమి తిథి సెప్టెంబర్ 30వ తేది ఎనిమిదవ రోజు చాలా విశేషమని పురాణాల్లో పేర్కొన్నారు.
ఈ విధంగా మహాగౌరి అమ్మవారిని పూజించాలి..
* సెప్టెంబర్ 30వ తేది (మంగళవారం) ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత.. పూజగదిని శుభ్రం చేసుకోండి. మీ పూజగదిలో స్థలం ఉంటే అక్కడే లేదంటే తూర్పు దిక్కున దుర్గాదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఒక పీటపై ఉంచండి. మీ దగ్గర గోదావరి నీళ్లు ఉంటే అవి అమ్మవారిపై చల్లాలి.. ఒకవేళ లేకపోతే దగ్గరలోని నది నీరు.. అది కూడా లేకపోతే మంచి నీటిలో పసుపు వేసి.. ఆ నీటిని తమలపాకుతో కానీ.. మామిడాకుతో కానీ అమ్మవారి పటానికి అభిషేకం చేయాలి. తర్వాత బియ్యం, కుంకుమ, పువ్వులు, అమ్మవారికి చీర, నగలు, పండ్లు, స్వీట్లు సమర్పించండి. దుర్గాదేవిని ఆవాహన చేసి పూజ చేయండి.
* దుర్గాష్టమి రోజు బాల పూజ చేస్తారు. బాలికలను మహాగౌరి అమ్మవారి స్వరూపంగా భావించి పూజించాలి. ఈ రోజున అమ్మవారికి గారెలు, పాయసం, పులిహోర నైవేద్యంగా సమర్పించాలి.
* దసరా రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన బాధలు, భయాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీపై అమ్మవారి దీవెనలు పుష్కలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించే దేవతగా అన్నపూర్ణ దేవిగా కొలుస్తారు. దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదివి.. ధూపం, దీపం, నైవేద్యం, హారతి సమర్పించాలి.
గౌరీదేవి విశిష్టత..
శివుడిని భర్తగా పొందేందుకు పార్వతి దేవి కఠోర తపస్సు చేసింది. ఈ సమయంలో పార్వతి అమ్మవారు.. వేర్లు, పండ్లు, ఆకులు మాత్రమే తిన్నారని స్కంధ పురాణంలో ఉంది. ఈ తపస్సు చేయడం వల్ల అమ్మవారి కోరిక నెరవేరింది. ఈ మహా తపస్సు ద్వారా అమ్మవారు గొప్ప గౌరవాన్ని సాధించినందుకు.. ఆమెకు మహాగౌరి అని పేరు పెట్టారు. భర్త కోసం తపస్సు చేసి గౌరీదేవిగా అవతరించింది కాబట్టే .. హిందూ వివాహ సమయంలో పెళ్లి కూతురితో గౌరీ పూజను చేయిస్తారు. అమ్మవారి తపస్సును మెచ్చిన భోళా శంకరుడు ప్రత్యక్షమై.. అమ్మవారిని గంగలో స్నానం చేయమని అడుగగా.. గంగలో స్నానం చేయడానికి తల్లి పార్వతి వెళ్లింది. కఠిన తపస్సు కారణంగా పార్వతీ అమ్మవారి రూపం నల్లటి రంగుతో కనిపించింది. ఈ రూపాన్ని కౌశికి అంటారు. స్నానం తర్వాత తల్లి రూపం ప్రకాశవంతమైన చంద్రుడిలా కనిపించింది.. అందుకే ఈ తల్లి రూపాన్ని మహాగౌరి అని పిలుస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook