)
IRCTC Latest Tour Package: దేశంలోని జ్యోతిర్లింగాలను సందర్శించాలంటే చాలా కష్టం. విడతల వారీగా జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకుంటుంటారు. అయితే రైల్వే శాఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను ఒకేసారి దర్శించుకనే అవకాశం కల్పిస్తోంది. మరోసారి అద్భుతమైన పర్యాటక ప్యాకేజ్ను ఐఆర్సీటీసీ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర.. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడపనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది.
సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర 8 రోజుల పాటు కొనసాగనుంది. తక్కువ ఖర్చుతో వసతి, ప్రయాణ సౌకర్యం, భద్రత కల్పిస్తూ పుణ్యక్షేత్రాలను ఐఆర్సీటీసీ అందిస్తోంది. 23వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే జ్యోతిర్లింగంతో దివ్య దక్షిణ యాత్ర పర్యటన ప్రారంభం కానుంది. ఈ రైలు తిరువన్నమలైలోని అరుణాచలం ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మధురైలోని మీనాక్షి ఆలయం, కన్యాకుమారిలోని రాక్ స్మారక చిహ్నం, కుమారి అమ్మన్ ఆలయం, త్రివేండ్రంలోని పద్మనాభస్వామి ఆలయం, త్రిచిలోని రంగనాథస్వామి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది.
బోర్డింగ్, డీ-బోర్డింగ్ స్టేషన్లు
తెలంగాణలోని జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, ఏపీలోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట వంటి స్టేషన్లలో మార్గమధ్యంలో ఇరువైపులా ప్రయాణికుల కోసం రైలు ఎక్కేందుకు /దిగేందుకు సౌకర్యం కల్పించింది.
ఎన్ని రోజులు
ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు/8 రోజులు ఉంటుంది. అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు, రోడ్డు రవాణా), వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, లంచ్, డిన్నర్- ఆన్-బోర్డు, ఆఫ్-బోర్డ్ రెండూ) ఉంటాయి. ప్రయాణం అంతటా వృత్తిపరమైన, స్నేహపూర్వక టూర్ ఎస్కార్ట్ల సేవలు, రైలులో సీసీటీవీ కెమెరాలు అన్ని కోచ్లలో అమర్చబడి ఉండడంతో భద్రతకు ఎలాంటి భయం లేదు. పబ్లిక్ అనౌన్స్మెంట్ సౌకర్యం, ప్రయాణ బీమా సౌకర్యం కల్పించారు. బుకింగ్ కోసం 97013 60701, 92810 30726, 92810 30740, 92814 95845 నంబర్లలో సంప్రదించాలని ఐఆర్సీటీసీ తెలిపింది.
జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్రల్లో సందర్శించే క్షేత్రాలు
తిరువణ్ణామలై అరుణాచలం ఆలయం
రామేశ్వరం రామనాథస్వామి ఆలయం
మధురై మీనాక్షి ఆలయం
కన్యాకుమారి రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయం
త్రివేండ్రం పద్మనాభస్వామి ఆలయం
తిరుచ్చి రంగనాథస్వామి ఆలయం
తంజావూరు బృహదీశ్వర ఆలయం
టూర్ ధర (ఒక్కొక్కరికి)
స్లీపర్ రూ.14,100
3ఏసీ రూ. 22,500
2ఏసీ రూ. 29,500
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.