)
Navratri 2025 Hindu Temple: నవరాత్రుల సందర్భంగా తొమ్మిది పవిత్ర రోజులలో తొమ్మిది అవతారలతో అమ్మవారిని పూజిస్తాము. అయితే చాలా మంది ఇంట్లోనే అమ్మవారిని అలంకరిస్తూ పూజలు చేస్తుంటారు. మరికొందరు అయితే అమ్మవారి అలంకరణ ఆధారంగా ఆయా అవతారాలకు సంబంధించిన ఆలయాలను సందర్శిస్తుంటారు. అలా నవరాత్రులకు ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో దర్శించుకోవడానికి ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్లో అమ్మవారి ఆలయాలు..
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం:
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లాలోని కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసింది శ్రీ కనకదుర్గ అమ్మవారు. ఈ ఆలయం తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రముఖమైన దుర్గాదేవి ఆలయం. దేవి నవరాత్రి ఉత్సవ వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఈ 9 రోజుల పాటు కనకదుర్గ అమ్మవారు రోజుకు ఒక అలాంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి ఆలయం:
శ్రీశైల శైవ క్షేత్రంలోని మల్లికార్జున స్వామి దేవాలయంతో పాటుగా ఇక్కడ భ్రమరాంబ దేవి దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తి పీఠం ఇక్కడ కలదు. దసరా ఉత్సవాలను ఇక్కడ కూడా ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఆలయం:
శ్రీకాళహస్తిలోని శైవ క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారితో పాటు అమ్మవారు జ్ఞానప్రసూనాంబగా కొలువై ఉన్నారు. ఇక్కడ కూడా నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి.
తెలంగాణలో అమ్మవారి ఆలయాలు..
బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం:
ఉమ్మడి ఆదిలాబాద్..ఇప్పటి నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి నది ఒడ్డున శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు వెలసింది. దేవి నవత్రుల ఉత్సవాల సందర్భంగా సరస్వతి అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. మూల నక్షత్రం రోజున ఇక్కడి సరస్వతి అమ్మవారి దేవాలయంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కోసం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
మెదక్లోని ఏడుపాయల వన దుర్గ భవానీ ఆలయం:
మెదక్లోని దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో వనదుర్గ మాత వెలసి ఉన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజుల పాటు వివిధ అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు.
జగిత్యాలలోని మైతాపూర్ కనక దుర్గ దేవి ఆలయం:
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఓ పర్వతంపై కొలువుదీరిన ఆలయం ఇది. శ్రీ కనకదుర్గమ్మకు విజయవాడలోని ఆలయం తర్వాత ఇక్కడ ప్రసిద్ధికెక్కింది. దసరా ఉత్సవాలను ఈ ఆలయంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.
యాదాద్రిలోని యాదగిరిగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం: యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా అతిదగ్గరలో ఉన్న శివాలయంలో దసరా నవరాత్రులు వెభవంగా జరుపుతారు.
వేములవాడ రాజరాజేశ్వరీ దేవి ఆలయం:
శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు కొలువై ఉన్న ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ఈ దేవాలయాలు ఎంతో ప్రసిద్ధి గాంచాయి. ఇవే కాకుండా మన ఊర్లలోని గ్రామదేవతల వద్ద కూడా దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు వారి ఆసక్తిని బట్టి ఆయా దేవాలయాలను దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook