Nirjala Ekadashi date remedies puja vidhan donation: హిందూ పండితులు నిర్జల ఏకాదశిని ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మనకు ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి. అవి శుక్లపక్షంలో ఒకటి కాగా, మరోకటి కృష్ణపక్షంలో వస్తుంది. ఈ క్రమంలో పండితులు ఈరోజున కొన్ని నియమాలను పాటిస్తే ధనధాన్యం భారీగా వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు.
ఈసారి మనం నిర్జల ఏకాదశిని జూన్ 6వ తేదీన జరుపుకోబోతున్నాం. ఈ క్రమంలో నిర్జల ఏకాదశి రోజున తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శుభ సమయం ఉందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో చేయాల్సిన దాన ధర్మాలను ఈ విధంగా వివరించారు. చాలా మంది తమ జీవితంలో అనుకూలమైన ఎదుగుదల లేక తీవ్రమైన ఇబ్బందులతో బాధలు పడుతుంటారు.
అదే విధంగా ఎంత కష్టపడ్డ సొంత ఇల్లు కొనుగోలు విషయంలో చాలా ఆటంకాలు ఎదురు చూస్తుంటారు. అందుకే ఈ రోజున ముఖ్యంగా వెండితో చేసిన పారిజాత పుష్పలు దానం చేస్తే అఖండ ధనయోగం సిద్దిస్తుంది. అంతేకాకుండా.. బంగారం రేకుతో చేసిన ఆవు అచ్చు వేయించి పండితులకు దానం చేస్తే.. వారికి జీవితంలో ఉన్నతమైన స్థానంను చేరుకుంటారు.
ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇళ్లకు చెందిన అంశాల సమస్యలతో బాధలు పడుతున్నవారు.. నిర్జల ఏకాదశి రోజు ఆవులకు బెల్లంతో పాటు, గోధుమ పిండిని కలిపి.. ముద్దలుగా చేసి తినిపించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే వారి ఇంట ఎల్లప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని, సొంతింటి కల వెంటనే సాకారం అవుతుందని పండితులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









